Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి23, హైదరాబాద్ :నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘భీష్మ’ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నితిన్ – రష్మిక జంట ప్రేక్షకుల నుంచి మంచి మార్కులను కొట్టేసింది. తెలుగురాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 6.4 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 2.21కోట్ల షేర్ ను రాబట్టింది.

నితిన్ కెరియర్లో ‘అ ఆ’ తరువాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ‘భీష్మ’ నిలిచింది. వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలాపడిన నితిన్, ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నాడట. నితిన్ అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని రష్మిక తన మార్కెట్ ను మరింతగా పెంచుకుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.