Sat. Jul 27th, 2024
kanchikacharla villagers distributed groceries to migrant workers

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 28,2020: వారికి రెక్కాడితేగాని డొక్కాడదు. అయినా పదిమందికి తమవంతు సాయం చేయాలనుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కరోన కష్ట కాలంలో ఆకలితో అలమటించే వారికి నిత్యావసర సరుకులు అందించేందుకు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ , కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన కొంతమంది గృహిణులు, యువకులు కలిసి చందాలు వేసుకొని వలస కార్మికులకు బియ్యం,కూరగాయలు, పప్పు, ఉప్పు, నూనె ఉచితంగా పంపిణీ చేశారు.

kanchikacharla villagers distributed groceries to migrant workers
kanchikacharla villagers distributed groceries to migrant workers
kanchikacharla villagers distributed groceries to migrant workers
kanchikacharla villagers distributed groceries to migrant workers
kanchikacharla villagers distributed groceries to migrant workers
kanchikacharla villagers distributed groceries to migrant workers
kanchikacharla villagers distributed groceries to migrant workers
kanchikacharla villagers distributed groceries to migrant workers

ఇబ్రహీంపట్నం మండలం దొనబండ గ్రామంలో వలస కార్మీకులు తినడానికి తిండి లేక పస్తులుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నకంచికచర్లకు చెందిన లక్ష్మీశెట్టి మణికంఠ తన స్నేహితులతోపాటు సామ్రాజ్యం , లక్ష్మీశెట్టి కోటేశ్వరమ్మ ,లక్ష్మీ తదితరులు కలిసి అన్నార్తుల ఆకలి తీర్చడానికి అవసరమైన నిధులు సేకరించారు. వాటితో కూరగాయలు,నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి దొనబండ గ్రామంలోని వలస కూలీలకు అందించారు. వీరి ఔదార్యాన్ని చూ సిన ఓ వ్యక్తి వారు సేవలందిస్తున్న పోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీంతో క్లిష్ట సమయం లో వలస కూలీలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సేవకులకు ” హ్యాట్సాఫ్ ” అంటూ వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.