Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి3,2020: తెలంగాణ కుంభమేళసమ్మక్క – సారలమ్మల మహాజాతర సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ అద్వర్యంలో పర్యాటకుల , భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారానికి హెలికాప్టర్ సేవలను రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్ లో ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీ లో బాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం , మేడారం నుండి హైదరాబాద్ లోని బేగం పేట ఎయిర్ పోర్టు వరకు నిర్వహిస్తున్నామన్నారు.

హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జి యస్ టి (1.80.000 + జి యస్ టి) ఉంటుందన్నారు.వీటితో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ నుంచి చూసేందుకు ప్రతి ప్రయాణికుడికి 2999.00 నామ మాత్రపు చార్జీ తో మేడారం సమ్మక్క – సారలమ్మ ల మహా జాతర కు వచ్చిన భక్తులకు , పర్యాటకులకు హెలిక్యాప్టర్ లో విహరించే అద్బుత అవకాశం ను తెలంగాణ పర్యాటక శాఖ కల్పించిందన్నారు. పర్యాటకులు హెలిక్యాప్టర్ సదుపాయం ను ఉపయేగించుకోవటానికి సంప్రదించవలసిన పోన్ నెంబర్ 94003 99999 ను సంప్రదించాలని మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక ,సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం ఛైర్మన్ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం MD మనోహర్ , పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.