365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబరు9,2023: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ చేపట్టిన శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగానికి శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

ఈ సందర్భంగా యాగశాలలో పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ చేపట్టారు. సెప్టెంబరు 11వ తేదీ వరకు ఈ యాగం జరుగనుంది.
