365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 21,2024: దేశభక్తి కలిగిన విద్యార్థులకు సైనిక్ పాఠశాలలు అద్భుతమైన అవకాశం అందిస్తున్నాయి. ఈ ఆలోచన కలిగిన వారికి ఇదే సువర్ణావకాశం. సైనిక్ పాఠశాలలు 2025-26 సంవత్సరంలో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశం పొందడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశ రక్షణలో భాగంగా త్రివిధ దళాలకు అవసరమైన సైనిక అధికారులను తయారు చేయాలనే లక్ష్యంతో సైనిక్ పాఠశాలలు ప్రారంభించబడ్డాయి.
ప్రవేశం:
ఆరు తరగతి: బాలబాలికలు.
తొమ్మిది తరగతి: బాలురు మాత్రమే అర్హులు.
ప్రవేశం పొందడానికి సైనిక్ పాఠశాల నిర్వహించే ప్రవేశ పరీక్ష, వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఈ పాఠశాలల్లో విద్యను ఇంటర్మెడియట్ వరకు కొనసాగించవచ్చు.
రిజర్వేషన్లు:
ఎస్సీ: 15%
ఎస్టీ: 7.5%
రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లలకు: 25%
మొత్తం సీట్లు:
ఆరు తరగతిలో 80 సీట్లు
తొమ్మిది తరగతిలో 20 సీట్లు
సౌకర్యాలు:
ఆరు నుంచి ఇంటర్ వరకు విద్య, వసతిపూర్తి, ఎన్సీసీ, యోగా, చిత్రలేఖనం, సంగీతం, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, ఈత, గుర్రపు స్వామీ తదితర సహపాఠ్య కార్యక్రమాలు.
మొదటి ఏడాది ఫీజు ₹1.10 లక్షలు.
విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50% విద్యార్థులకు రక్షణ శాఖ నుంచి ₹53,000 ఉపకార వేతనం.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ పరివాలన.
సైనిక్ పాఠశాలలో విద్య:
ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు పుణేలో 2 సంవత్సరాల శిక్షణ పొందవచ్చు. ఆ తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో అధికారులుగా నియమిస్తారు.
పరీక్ష విధానం:
ప్రవేశ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా నిర్వహించబడుతుంది.
ఆరు తరగతి: 2.5 గంటలు (150 నిమిషాలు).
తొమ్మిది తరగతి: 3 గంటలు (180 నిమిషాలు).
పరీక్షా భాషలు: ఆరు తరగతికి అన్ని ప్రాంతీయ భాషల్లో, తొమ్మిది తరగతికి ఆంగ్లంలో.
సిలబస్:
ఆరు తరగతి: 300 మార్కులకు పరీక్ష.
గణితం: 150 మార్కులు
జనరల్ నాలెడ్జ్: 50 మార్కులు
భాషా సామర్థ్యం: 50 మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్: 50 మార్కులు
తొమ్మిది తరగతి: 400 మార్కులకు పరీక్ష.
గణితం: 200 మార్కులు
సామాన్యశాస్త్రం: 50 మార్కులు
ఆంగ్లం: 50 మార్కులు
సాంఘికశాస్త్రం: 50 మార్కులు
ఇంటెలిజెన్స్: 50 మార్కులు
ప్రతి విభాగంలో కనీసం 25% మార్కులు సాధించాలి, మొత్తం 40% మార్కులు పొందాలి.
అర్హతలు:
ఆరు తరగతి: 10 నుంచి 12 ఏళ్ల వయస్సు (01 ఏప్రిల్ 2013 నుండి 31 మార్చి 2015 మధ్య జన్మించాలి) 5వ తరగతిలో చదువుతూ ఉండాలి.
తొమ్మిది తరగతి: 13 నుంచి 15 ఏళ్ల వయస్సు (01 ఏప్రిల్ 2010 నుండి 31 మార్చి 2012 మధ్య జన్మించాలి) మరియు 8వ తరగతిలో చదువుతూ ఉండాలి.
దరఖాస్తు విధానం:
ప్రవేశ పరీక్ష 2025 జనవరి 28న నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి, www.aissee.nta.nic.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తుకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫోటోలుసంతకాలను అప్లోడ్ చేయాలి.
ఫీజు:
జనరల్, డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు: ₹650
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు: ₹500
తుది గడువు: డిసెంబర్ 20
ధ్రువపత్రాలు:
జనన ధ్రువపత్రం, కుల ధ్రువపత్రం, నివాస ధ్రువపత్రం.
సైనిక ఉద్యోగుల పిల్లలకు సర్వీసు ధ్రువపత్రం, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు పీపీఓ.
పరీక్షా కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం.