
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,
సెప్టెంబర్ 11,2021:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వ దర్శనం టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది.
అయితే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయం తెలియక సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతికి వచ్చి ప్రయత్నించి నిరాశగా వెనుదిరుగుతున్నారు.

కావున తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టిటిడికి సహకరించాలని విజ్ఞపి చేయడమైనది.