365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,డిసెంబర్ 30,2020:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లోని రాజ్కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ నెల 31 న ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నర్, గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర ఆరోగ్య మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కూడా పాల్గొంటారు.
ఈ ప్రాజెక్టు కోసం 201 ఎకరాల భూమిని కేటాయించడమైంది. దీనిని 1195 కోట్ల రూపాయల అంచనా ఖర్చుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు 2022వ సంవత్సరం మధ్య కల్లా పూర్తి కాగలదని ఆశిస్తున్నారు. అత్యాధునికమైన 750 పడకలతో ఏర్పాటయ్యే ఆసుపత్రిలో 30 పడకలతో కూడిన ఆయుష్ బ్లాకు కూడా ఉంటుంది. ఈ ఎఐఐఎమ్ఎస్ లో 125 ఎమ్బిబిఎస్ సీట్లతోపాటు, 60 నర్సింగ్ సీట్లు ఉంటాయి.
