365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 11,2025: మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పూలదండ వేసి పుష్పాంజలి ఘటించారు.

Read this also…Tira Turns Two: A Bold New Chapter in India’s Beauty Evolution

ఇది కూడా చదవండి..వృషభ మూవీ రివ్యూ, రేటింగ్ ..? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ద్వారానే సమాజంలోని అన్ని వివక్షలను రూపుమాపవచ్చని తెలియజేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబాపూలే అని అన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని గుర్తించి మహిళలకు విద్యను అందజేస్తే సమాజమంతా అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి అని తెలిపారు.

తన భార్యకు చదువు చెప్పించి దేశంలోని తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారన్నారు. బాలికలకు విద్యను అందించేందుకు 150 ఏళ్ల కిందటే బాలికల పాఠశాల ఏర్పాటు చేశారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో విద్యకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి అంతర్జాతీయ స్థాయితో కూడిన సమగ్ర గురుకుల విద్యాలయాలు స్థాపించి పేదవారిని విద్య ద్వారానే అభివృద్ధి పరచవచ్చని నమ్మి అమలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి..పీఎం, సీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులను ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చనున్న యోగి సర్కార్

ఇది కూడా చదవండి…తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టిఎస్ఆర్డిఏ) నూతన కార్యవర్గం ఏర్పాటు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో జ్యోతిబా పూలే సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని వాటిని చేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH విద్యాసాగర్ తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు పాల్గొని జ్యోతిబాపూలే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా జ్యోతిబాపూలే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.