365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, ఏప్రిల్ 20, 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ భారీ ప్రకటన విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. అలాగే దరఖాస్తుల వివరాలతో పాటు షెడ్యూల్ వివరాలను కూడా వెల్లడించారు.
ఇది కూడా చదవండి..2025 మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 16,347 పోస్టుల భర్తీకి సన్నాహాలు
Read this also…‘Suryapet Junction’ Set for a Grand Theatrical Release on April 25
Read this also…Indkal Technologies Unveils Acer-Branded Smartphones in India with Segment-Leading Features
మంత్రివర్యులు ఆశావహులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారిక వెబ్సైట్లు
🔗 https://cse.ap.gov.in,
🔗 https://apdsc.apcfss.in
వెనుకే ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు.

డీఎస్సీ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం ఇలా:
డీఎస్సీ-2025 నోటిఫికేషన్కు సంబంధించి పరీక్షా షెడ్యూల్, సిలబస్, పోస్టుల విభజన, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు), సహాయ కేంద్రాల వివరాలు మొదలైనవి పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఈరోజు ఉదయం నుంచే అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.
2025 మెగా డీఎస్సీ షెడ్యూల్ వివరాలు..
- దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు..
📅 ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు
-హాల్ టికెట్ల డౌన్లోడ్:
📅 మే 30 నుంచి ప్రారంభం
- పరీక్షల నిర్వహణ:
📅 జూన్ 6 నుంచి జూలై 6 వరకు
-ప్రాథమిక కీ విడుదల:
పరీక్షలు పూర్తైన రెండో రోజున
-అభ్యంతరాల స్వీకరణ:
ప్రాథమిక కీ తర్వాత ఒక వారం పాటు
-ఫైనల్ కీ విడుదల:
అభ్యంతరాల స్వీకరణ తర్వాత 7 రోజుల్లో
- మెరిట్ జాబితా విడుదల:
ఫైనల్ కీ తర్వాత వారానికి..