365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 9,2025: ముంబైలో 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడుల మాస్టర్మైండ్గా పేర్కొన్న తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు అప్పగించే ప్రక్రియ పూర్తయింది. అతను ఇప్పుడు భారత్లో ఏ జైలులో ఉంటాడనే దానిపై చర్చ జరుగుతోంది.
అమెరికా సుప్రీం కోర్టు అతని ప్రత్యర్పణకు అడ్డంకులను తొలగించడంతో, భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తహవూర్ రాణా, పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా పౌరుడు, లష్కర్-ఎ-తొయిబా సభ్యుడిగా ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. 26/11 దాడుల్లో అతని సహచరుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సహాయం అందించాడని చెబుతున్నారు.
ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. రానా భారత్కు రాగానే NIA అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనుంది.
Read this also…Gehis Immigration and International Legal Services Simplifies U.S. Visa Process for Artists and Entertainment Professionals
Read this also…Megastar Chiranjeevi and Smt. Surekha Rush to Singapore After Pawan Kalyan’s Son Mark Shankar Injured in Fire Accident
ప్రస్తుతం తహవూర్ రాణాను దేశంలోని ఏ జైలులో ఉంచాలనే దానిపై స్పష్టత లేదు. ఢిల్లీలోని తీహార్ జైలు, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు లేదా ఇతర అత్యంత భద్రత కలిగిన జైళ్లలో ఒకదానిలో అతన్ని ఉంచే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా న్యాయ వ్యవస్థ సిఫార్సులకు అనుగుణంగా జైలు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాణా గతంలో దుబాయ్ నుంచి ముంబైకి వచ్చి, 2008 నవంబర్ 11 నుంచి 21 వరకు పవాయ్లోని రెనైసాన్స్ హోటల్లో బస చేశాడని, ఆ తర్వాత ఐదు రోజులకే ముంబై దాడులు జరిగాయని పోలీసు దర్యాప్తు వెల్లడించింది.
అతని విచారణ ద్వారా పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ ధికారులతో అతని సంబంధాల గురించి మరింత సమాచారం బయటకు రానుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ విషయం భారత్కు రాజకీయంగా పెద్ద విజయంగా భవిస్తున్నారు. తహవూర్ రాణా భారత్లో విచారణను ఎదుర్కొని, 26/11 బాధితులకు న్యాయం చేసే దిశగా అడుగులు పడనున్నాయి.