3656తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్ ,జనవరి 4,2021:స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 29.12.2020 న ‘‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2020’’ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.పోస్టుల వివరాలు,వయోపరిమితి, చెల్లించాల్సిన విద్యార్హత ఫీజు, పరీక్ష విధానం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి మొదలైన వాటికి సంబంధించిన సమాచారం రిక్రూట్మెంట్ నోటీసులో వివరంగా ఇవ్వబడింది. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ssc.nic.in ద్వారా మాత్రమే సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 31.01.2021 ఆన్లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ 02.02.2021.ఆన్ లైన్ దరఖాస్తు ఫారంలో అభ్యర్థులు స్కాన్ చేసిన కలర్ పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది, నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రచురించిన తేదీ నుంచి మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉండరాదు,ఫోటోగ్రాఫ్ తీసుకున్న తేదీని స్పష్టంగా ఫోటోగ్రాఫ్ మీద ప్రింట్ చేయాలి.ఫోటోగ్రాఫ్ మీద తేదీ ప్రింట్ లేని అప్లికేషన్ లు తిరస్కరించబడతాయి.

సదరన్ రీజియన్ లో,కంప్యూటర్ ఆధారిత ఎగ్జామినేషన్ టైర్-1 29.05.2021నుంచి 07.06.2021వరకు 21 సెంటర్/సిటీల్లో నిర్వహించబడుతుంది.ఆంధ్రప్రదేశ్ లోని చీరాల,గుంటూరు,కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగర తెలంగాణలో,హైదరాబాద్, కరీంనగర్ & వరంగల్; తమిళనాడులోని,చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు; పుదుచ్చేరి లలో నిర్వహించబడుతుంది.