365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ఫిబ్రవరి 10,2021:భారతదేశపు సుప్రసిద్ధ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్ మరింతగా తమ విస్తరణ కొనసాగిస్తూ గురుగ్రామ్ కేంద్రంగా కలిగిన రెంటల్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కంపెనీ ప్రాప్డయల్తో భాగస్వామ్యం చేసుకుంది.ప్రాప్టైగర్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్లను సొంతం చేసుకున్న ఎలారా టెక్నాలజీస్ సొంతమైన ఆన్లైన్ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్ ఇటీవలనే తమ ఫుల్ స్టాక్, అనుబంధ సేవల వేదిక హౌసింగ్ ఎడ్జ్ను ఆవిష్కరించిన అనంతరం ఈ ప్రకటన వచ్చింది.ప్రాప్డయల్తో భాగస్వామ్యంతో హౌసింగ్ డాట్కామ్ ఇప్పుడు రెంటల్/లీజింగ్ నుంచి అద్దెదారుని పూర్వాపరాల పరిశీలన, అద్దె ఒప్పందాలు, అద్దె కలెక్షన్/బిల్లు చెల్లింపులు సహా తమ ఖాతాదారులకు ప్రోపర్టీ మేనేజ్మెంట్ మద్దతును అందించనుంది. ఈ సేవలలో భాగంగా నాణ్యమైన ఆస్తుల నిర్వహణ మద్దతును సైతం అందించనుంది.ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్,ముంబై, హైదరాబాద్, చెన్నై, పూనెలలో చాలా వరకూ సేవలను తొలుత అందించినా తరువాత కాలంలో వీటిని ఇతర నగరాలలో సైతం అందించనున్నారు.‘‘కంపెనీ చరిత్రలో ఇది ఓ మైలురాయిగా నిలువనుంది.

ఈ భాగస్వామ్యంతో మరింత సమగ్రమైన విధానంలో ఖాతాదారులను కంపెనీ చేరుకోనుంది. ఈ భాగస్వామ్యం మరీ ముఖ్యంగా మా ఎన్ఆర్ఐ ఖాతాదారులకు ప్రయోజనం కలిగించనుంది. ఎందుకంటే విదేశాల నుంచి వారు తమ ఆస్తులను నిర్వహించడం కష్టం. ప్రాప్డయల్ నుంచి నిర్వహణ సహాయంతో మేము వారి లీజింగ్, ప్రోపర్టీ మేనేజ్మెంట్ సంబంధిత అవసరాలను తీర్చడానికి ఏకీకృత కేంద్రంగా నిలువనున్నాం’’ అని మణి రంగరాజన్, గ్రూప్ సీఓఓ, హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ అన్నారు.‘‘ఇంటి యజమానుల అంచనాలలో స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. వారు కేవలం అద్దె నిర్వహణ పరిష్కారాలు మాత్రమే కాదు, సమగ్రమైన ఆస్తి నిర్వహణనూ కోరుకుంటున్నారు. ఇప్పుడు హౌసింగ్ డాట్ కామ్తో కలిసి మేమిప్పుడు ఎంతో కాలంగా యజమానులకు క్లిష్టంగా ఉన్న అంశాలను పరిష్కరించనున్నాం’’ అని ప్రాప్డయల్ కో–ఫౌండర్, సీఈవో వినయ్ ప్రజాపతి అన్నారు.ప్రాప్ డయల్ సీఓఓ , కో–ఫౌండర్ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ ప్రస్తుతం తాము 15 కు పైగా భారతీయ నగరాలలో సేవలనందిస్తున్నామని, 40కు పైగా దేశాల్లో తమ ఖాతాదారులు ఉన్నారని వెల్లడించారు.