
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తెలంగాణా,జూలై 9, 2021:దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తమ నెట్వర్క్ను విస్తరించడం ద్వారా ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలనుకునే వేలాది మంది విద్యార్థులు కలలను సాకారం చేయాలనే లక్ష్యానికనుగుణంగా దేశంలో అగ్రగామి టెస్ట్ ప్రిపరేషన్ సేవల సంస్థ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) భూపాలపల్లిలో తమ మొట్టమొదటి సమాచార కేంద్రాన్ని ఇంటి నెంబర్ 3–343, రాజీవ్ నగర్ మెయిన్ రోడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కన, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణా , వద్ద ప్రారంభించింది.
ఈ సమాచార కేంద్రం వద్ద ఆకాష్కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా అది అందించే కోర్సులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారమూ పొందవచ్చు. ఆకాష్ వద్ద విద్యార్థులు ఇప్పుడు వైద్య, ఇంజినీరింగ్ కోర్సులతో పాటుగా ఫౌండేషన్ స్థాయి కోర్సులను సైతం ఎంచుకోవచ్చు.

ఈ నూతన సమాచార కేంద్రాన్ని వర్ట్యువల్గా అనూప్ అగర్వాల్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ :సందీప్ ధామ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ;ధీరజ్ కుమార్ మిశ్రా, రీజనల్ డైరెక్టర్–ఏఈఎస్ఎల్ ప్రారంభించగా, భౌతికంగా కె రాజు డిప్యూటీ డైరెక్టర్ ;ఎం భరత్, ఏబీహెచ్,మధుసూదన్ పులి, ఏడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అధికారులు, ఫ్యాకల్టీ, అతిథులు పాల్గొన్నారు.
ఈ ప్రారంభం గురించి ఆకాష్ చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మాట్లాడుతూ ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలని ఆశిస్తోన్న స్థానిక విద్యార్థులకు భూపాలపల్లిలోని ఈ కేంద్రం ఓ వరంగా మారనుందన్నారు. దేశవ్యాప్తంగా తమ నాణ్యమైన బోధన ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరువయ్యామంటూ ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్లకు ఎంపికైన తమ విద్యార్థులే దానికి నిదర్శనమన్నారు.

ఆకాష్లో చేరగోరు విద్యార్థులు ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (ఐఏసీఎస్టీ) లేదంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ పరీక్షలలో పాల్గొనవచ్చు. ఐఏసీఎస్టీని 8–12 తరగతి విద్యార్థులకు 90% వరకూ స్కాలర్షిప్ను ట్యూషన్ ఫీజుపై అందించేందుకు నిర్వహిస్తున్నారు.