
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగస్టు 28,2021:టిటిడి ప్రచురించిన కవిత్రయ మహా భారతం, రూట్స్ పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉంచినట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.
టిటిడి ఇటీవల పునః ముద్రించిన కవిత్రయ మహా భారతం 15 వాల్యుమ్లు (తెలుగు) రూ. 4,100-, వేదాలకు సంబంధించిన రూట్స్ (ఆంగ్ల) పుస్తకం రూ. 850- భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమల, తిరుపతిల్లోని టిటిడి ప్రచురణ విక్రయ శాలల్లో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
