
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, సెప్టెంబర్11,2021: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయ కార్యక్రమాలు మూడో రోజైన శనివారం ఏకాంతంగా జరిగాయి.
ఆలయంలోని కల్యాణమండపంలో బాలాలయం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం క్రతువులు ఏకాంతంగా చేపట్టారు. సాయంత్రం కార్యక్రమాలు కూడా ఏకాంతంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు,ఆలయ ప్రధానార్చకులు పి.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు,ఎఈవో ,ఎం.రవికుమార్రెడ్డి, సూపరింటెండెంట్,ఎ.నారాయణ,టెంపుల్ ఇన్స్పెక్టర్, ఎ.కామరాజు పాల్గొన్నారు.