PAVITRA SAMARPANA HELD AT TIRUCHANOORPAVITRA SAMARPANA HELD AT TIRUCHANOOR
PAVITRA SAMARPANA HELD AT TIRUCHANOOR

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్19, 2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఉద‌యం11.30 నుంచి మ‌ధ్యాహ్నం12;30 గంటల వ‌ర‌కు పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు.

PAVITRA SAMARPANA HELD AT TIRUCHANOOR
PAVITRA SAMARPANA HELD AT TIRUCHANOOR

అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్ర 6;00 నుంచి 7;30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ సదా భార్గవి, ఆలయ డిప్యూటీ ఈవో క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు బాబుస్వామి, సూపరింటెండెంట్‌ మ‌ధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ పాల్గొన్నారు.