
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, హైదరాబాద్, 4డిసెంబర్, 2021:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన వయసు 89 సంవత్సరాలు.15సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు.

ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు గవర్నర్గానూ సేవలందించారు. 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. ఉదయం బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం స్టార్ ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయప్రస్థానం…

మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా బాధ్యలు చేపట్టారు. ప్రభుత్వంలో ఆర్అండ్బీ, రవాణా శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఉమ్మడి ఏపీలో పలు కీలక శాఖలు నిర్వహించిన ఆయన సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2009లో సీఎం రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు సీఎంగా పనిచేశారు. అనంతరం ఐదేండ్లపాటు తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు 31వ గవర్నర్గా బాధ్యలు చేపట్టిన రోశయ్య.. 2016, ఆగస్టు 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. వయోభారంతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
రోశయ్య రికార్డులు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య పేరిట బోలడన్ని రికార్డులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య పేరిట ఉంది. ఆయన మొత్తం 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దాంట్లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు ప్రవేశపెట్టగా.. ఒకసారి సీఎంగా ఆయన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ రికార్డును నెలకొల్పిన నేత కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఎవరూ లేరు.

అసాధారణ ట్యాలెంట్ ఉన్న రాజకీయవేత్తగా రోశయ్యకు గుర్తింపు ఉంది. ఇక ఆయన మాట్లాడితే ఎదుటివారు ఖంగుతినాల్సిందే. అద్భుతమైన మాటకారి అన్న ఐడెంటిటీ కూడా రోశయ్యకు ఉంది. ఛలోక్తులు, చమత్కారాలు వేయడంలోనూ రోశయ్య దిట్ట. నిజానికి గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ ఫేమస్. కానీ రోశయ్య మాత్రం తాను పనిచేసిన అందరు సీఎంలతో కలిసిమెలిసి ఉన్నారు. చాలా షార్ప్గా లాజిక్గా మాట్లాడుతూ.. అసెంబ్లీలో రోశయ్య సభ్యుల్ని అట్రాక్ట్ చేసేవారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించే సత్తా కలిగిన నేతగా రోశయ్య ఎదిగారు.
ఏపీ బడ్జెట్ను 16 సార్లు ప్రవేశపెట్టిన ఆయన.. ఓ దశలో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ను సమర్పించారు. 1980 దశకంలో శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు. అయితే 1984లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మండలిని రద్దు చేశారు. మండలిలో రోశయ్యను ఎదుర్కోలేకనే.. ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తుంటాయి