365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి,ఫిబ్ర‌వ‌రి 18,2022: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శనివారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఆలయంలో ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయి.

ఈ సందర్భంగా సాయంత్రం 6నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్ప‌ణ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 20న ధ్వ‌జారోహ‌ణం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు ఆదివారం ఉద‌యం 9 నుంచి 9.20 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది. అంత‌కుముందు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7నుంచి 8 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ జ‌రుగ‌నుంది.