365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 10,2022: మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలని శ్రీ నారాయణ స్కూల్ అధ్యక్షుడు రాజేంద్ర బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు కానాజింగూడలోని శ్రీ నారాయణ స్కూల్ లో ఎయిమ్స్ హ్యూమన్ సొసైటీ సర్వే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళల హక్కుల పై ప్రసంగించారు. కాలం మారుతున్న మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందని వివక్ష తొలగించేందుకు చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు.

అనంతరం ఎన్జీవో వ్యవస్థాపకుడు మాధవవాసు మాట్లాడుతూ గడచిన రెండున్నర దశాబ్దాలుగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ తమవంతుగా సహకారం అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎన్జీవో వ్యవస్థాపకుడు మాధవ సు స్కూల్ అధ్యక్షుడు రాజేంద్ర బాబు కు శ్రీ నారాయణ స్కూల్ గ్రంథాలయం కోసం 51వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది పావని కళ్యాణ్ రామ్, పాఠశాల ప్రిన్సిపల్ రాఘవాచారి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.