IIT Kharagpur

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 7,2022:విద్యుత్ వాహనాల కోసం వినియోగిస్తున్న ఉపకారణాల్లో 90శాతం ఉపకరణాలు ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి అవుతున్నమోటార్,కంట్రోలర్, కన్వర్టర్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్,ఛార్జర్ లాంటి ఉపకరణాలుదేశ పర్యావరణ పరిస్థితులు, రహదారులు, ట్రాఫిక్ పరిస్థితులకు అనుకూలంగా లేవు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలో దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉపకరణాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా దేశంలో వినియోగంలో ఉన్న80శాతంపైగా వాహనాలకు అవసరమైన 2 డబ్ల్యు/ 3 డబ్ల్యు ఉత్పత్తికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానం అభివృద్ధి చేశారు.

IIT Kharagpur

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ- రిక్షాలకు అవసరమైన బి ఎల్ డి సి మోటార్,స్మార్ట్ కంట్రోలర్ ను ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసిన మోటార్, స్మార్ట్ కంట్రోలర్ సమర్ధంగా పనిచేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సర్టిఫికెట్ కలిగి ఉంటుంది. మోటార్ ,స్మార్ట్ కంట్రోలర్ వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించేందుకు జరిగిన కార్యక్రమంలో మెస్సర్స్ బ్రష్లెస్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సాంకేతికత పరిజ్ఞానం బదిలీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆల్కేష్ కుమార్ శర్మ, అదనపు కార్యదర్శి డాక్టర్ జైదీప్ కుమార్ మిశ్రా, మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ పరిశోధన అభివృద్ధి గ్రూప్ కోఆర్డినేటర్ సునీతా వర్మ, ఐఐటీ ఖరగ్‌పూర్ కి చెందిన డాక్టర్ సోమనాథ్ సేన్‌గుప్తా, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైంటిస్ట్ డి ఓం క్రిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కార్యక్రమం ఏర్పాటయింది.