suicide

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 30,2022: బాలానగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌పై నుంచి మంగళవారం ఉదయం పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ముప్పై ఏళ్ల వయసున్న బాధితుడు భవన నిర్మాణ కార్మికుడని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ సంఘటన తెల్లవారుజామున 2 గంటలకు జరిగిందని, బాలానగర్ క్రాస్‌రోడ్‌కు సమీపంలో ఉన్నఫ్లైఓవర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడని దర్యాప్తు చేస్తున్న బాలానగర్ పోలీసులు పేర్కొన్నారు.