365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,లక్నో ,సెప్టెంబర్ 5,2022: లక్నోలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలైన లక్నోలోని హోటల్ లెవానా యజమానులు,నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు సాగర్ శ్రీవాస్తవతో పాటు యజమానులు రోహిత్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లక్నో డెవలప్మెంట్ అథారిటీ (ఎల్డిఎ) అధికారి మాట్లాడుతూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా లేదు. హోటల్ నిర్మాణంలో అనేక చట్టాలు ఉల్లంఘించారు. “మేము పత్రాలను పరిశీలిస్తున్నాము,వీలైనంత త్వరగా కఠిన చర్యలు ప్రారంభిస్తాము, అని పోలీసుఅధికారి తెలిపారు. సోమవారం ఉదయం లెవానా హోటల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది,హోటల్, రెండవ,మూడవ అంతస్తులో దాదాపు 24మంది చిక్కుకున్నారు. .

అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి అద్దాలను పగలగొట్టారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కొందరు అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు, ఏదైనా తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.