Fire accident _secunderabad

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, సికింద్రాబాద్,సెప్టెంబర్ 13, 2022: తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో బహుళ అంతస్తుల భవనంపై అంతస్తులోని ఓ హోటల్‌కు నిన్న అర్థరాత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్‌లో చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌లో ప్రకటించారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకు నేందుకు విచారణకు ఆదేశించినట్లు తెలంగాణ హోంమంత్రి మహ్మద్ మెహమూద్ అలీ తెలిపారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయని, వెంటనే మొదటి , రెండవ అంతస్తులోని రూబీ హోటల్‌కు వ్యాపించిందని, అక్కడ ఆసమయంలో 25 మంది అతిథులు బస చేశారని పోలీసులు తెలిపారు. పొగ కారణంగా ఊపిరాడక చాలా మంది మరణించినట్లు తెలుస్తోంది.

Fire accident _secunderabad

అగ్నిమాపక శాఖ క్రేన్ నిచ్చెనలను ఉపయోగించి చాలా మందిని రక్షించింది. అయితే కొంతమంది స్థానికులు కూడా సహాయక చర్యలలో సహాయం చేశారని అధికారులు తెలిపారు. మంటల నుంచి తప్పించు కోవడానికి కొంతమంది వ్యక్తులు హోటల్ కిటికీల నుంచి దూకేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.