janasena

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 27,2022: “వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూచూస్తామని పవన్ కళ్యాణ్ విమ ర్శించారు. హత్య రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరిని మిగల్చం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలను కనీసం వైసీపీ నాయకత్వం కూడా ఖండించడం లేదని ఆయన అన్నారు.

అలాంటి వారిని అలాంటి ప్రకటనలను, ఖండించకపోతే కచ్చితంగా వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూస్తామని, అలాంటి ఉగ్రవాద సంస్థకు సజ్జల రామకృష్ణా రెడ్డి ని ప్రధాన సలహాదారుగానే పరిగణిస్తామని పవన్ దుయ్యబట్టారు. రాయలసీమ సంస్కార సీమ. చదువుల నేల. ఇక్కడ ఎంతో అద్భుతమైన వ్యక్తులు తిరిగాడారు. ఆ నేలకు కచ్చితంగా తగిన గౌరవం ఇస్తాం. రాయలసీమగాని, ఉత్తరాంధ్రలోగాని నాయకులు వెనకబడడం లేదు.

janasena

కేవలం ప్రజలను మాత్రమే నాయకులు వెనకుండేలా చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి కూడా వైసీపీ నాయకుల ఇసుక మాఫియా వాళ్ళే కారణం. ప్రాజెక్ట్ నిర్వహణ కోసం రూ.కోటి ఖర్చు చేసి ఉంటే, ఇంత ఆస్తి నష్టం, ప్రాణం నష్టం జరిగేది కాదు. దానికి ఈ ప్రభుత్వం కనీసం ముందుకు రాలేదని” పవన్ పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి..

బెదిరించి ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్నిఅపహస్యం చేశారు: జనసేన అధినేత
నన్ను ఇబ్బంది పెట్టిన వారెవరినీ మర్చిపోను: పవన్ కళ్యాణ్

”AP04 రామాపురం” సినిమా ట్రైలర్ రిలీజ్

20 రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్ నుంచి రక్షించే వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..

భవిష్యత్తులో పాల ధరలను పెంచే ఆలోచన లేదన్న అమూల్

‘ త్వరలో మరో మహమ్మారి.. పరిస్థితులు చాలా ఘోరం ఉండవచ్చు’

ఎన్‌డీటీవీ స్వాధీనంపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు

 చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. పలుచోట్ల లాక్ డౌన్..