365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,జనవరి 21,2023:TVS మోటార్ కంపెనీ కొత్తగా మార్కెట్ లోకి ప్రవేశపెట్టిన iQube ఎలక్ట్రిక్ స్కూటర్ 50వేల యూనిట్లపైగా వెహికల్స్ ను విక్రయించింది.
TVS iQube అధికారికంగా మే 2022లో లాంఛ్ అయ్యింది. అప్పటి నుంచి కంపెనీ పోర్ట్ఫోలియోలో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.

ఎలక్ట్రిక్ స్కూటర్ దాని సాంప్రదాయ స్టైలింగ్, మంచి స్పెసిఫికేషన్లు, రైడ్ అనుభవం కారణంగా కొనుగోలుదారులలో ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతోంది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చాలా షోరూమ్ల నుంచి స్కూటర్ను ప్రమోట్ చేస్తోందిTVS.ఫీచర్లు రైడింగ్ రేంజ్ అందించడానికి కంపెనీ ఇటీవల తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్ల లైనప్ను అప్డేట్ చేసింది.
ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో iQube ఎలక్ట్రిక్ సిరీస్ కొత్త శ్రేణిని మూడు వేరియంట్లలో ప్రారంభించింది.
iQube Standard, iQube S, iQube ST. ఇ-స్కూటర్ 11 రంగులలో, మూడు ఛార్జింగ్ ఎంపికలలో అందుబాటులోకి వచ్చింది. TVS iQube స్టాండర్డ్ , S వేరియంట్ల విక్రయం కొనసాగుతోంది.

అయితే చాలా మంది కస్టమర్లు ఇప్పటికీ టాప్-ఎండ్ ST వేరియంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది మరిన్ని ఫీచర్లు,మెరుగైన రైడింగ్ రేంజ్ను అందిస్తుంది.
iQube ధర రూ. 99,130 ఉండగా iQube S ధర రూ. 1,04,123 (ఆన్-రోడ్, ఢిల్లీ-NCR, ఫేమ్ II అండ్ రాష్ట్ర సబ్సిడీతో సహా) ఉన్నాయి. ఈ వేరియంట్లు TVS మోటార్ డిజైన్ చేసిన 3.4 kWh బ్యాటరీ స్పెసిఫికేషన్తో వస్తాయి.
ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 100-కిమీ ఆన్-రోడ్ రేంజ్ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ 7-అంగుళాల TFT డిస్ప్లే, HMI నియంత్రణలు, రివర్స్ పార్కింగ్ వంటి లక్షణాలను పొందుతుంది.
TVS iQube ST
టాప్-ఆఫ్-లైన్ TVS iQube ST వేరియంట్ TVS మోటార్ రూపొందించిన 5.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140-కిమీల ఆన్-రోడ్ రేంజ్ను అందిస్తుంది.

iQube ST ధరలను కంపెనీ ప్రకటించలేదు. కంపెనీ ఇప్పటికే రూ.999 ధరతో బుకింగ్ ప్రారంభించినప్పటికీ. కంపెనీ iQube ST వేరియంట్ను ఆటో ఎక్స్పో 2023లో ప్రదర్శించింది.
ద్విచక్ర వాహన తయారీదారు iQube ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం మూడు విభిన్న ఛార్జింగ్ ఎంపికలను అందిస్తోంది, అవి – 650W ఛార్జర్, 95W ఛార్జర్ 1.5kWh ఛార్జర్.
iQube ST బ్యాటరీ ప్యాక్ను సాధారణ ఛార్జర్తో ఐదు గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు ఏడు గంటల సమయం పడుతుందని టీవీఎస్ పేర్కొంది.