365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఏప్రిల్ 19,2023: భారతీయ రైల్వేలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల సౌకర్యార్థం మధ్యప్రదేశ్లోని రేవా నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ల మధ్య రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ పేరు “రివా ఇత్వారీ”. ఈ రైలు వారానికి నాలుగు రోజులు నడుస్తుంది.
ఇంతకు ముందు వారానికి మూడు రోజులు రైలు నడుస్తున్నప్పటికీ, ఈ ఇప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు ఏడు రోజులూ నాగ్పూర్కు రైలు అందుబాటులోకి రానుంది. సాధారణ ప్రజలు కూడా ఈ రైలులో ప్రయాణించవచ్చు, అనారోగ్యంతో ఉన్నవారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం దీని ఉద్దేశం.

రేవా దాని చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చికిత్స కోసం నాగ్పూర్కు వెళ్ళుతుంటారు. రైలులో సీట్లు లేకపోవడంతో ప్రజలు బస్సులు లేదా ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
దీనికి ఎక్కువ సమయం డబ్బు వృధా అవుతుంది. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నవారు కూడా ప్రయాణంలో అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ కొత్త రైలును నడపబోతోంది. ఏప్రిల్ 24న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం వెళ్లేందుకు ఈ రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు రేవా, సత్నా కట్ని, జబల్పూర్ మీదుగా నాగ్పూర్ చేరుకుంటుంది.

రేవా నుంచి సత్నా మధ్య దూరం దాదాపు 780 కి.మీ. దీని షెడ్యూల్ త్వరలో విడుదల చేయనుంది రైల్వే మంత్రిత్వ శాఖ. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు భవిష్యత్ ప్రయాణాలకు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కలిపిస్తుంది.