365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 22,2024:ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు 2024 జూలై 21న గురు పూర్ణిమ శుభ సందర్భంగా రెండు ఆకర్షణీయమై న కొత్త పుస్తకాలతో పాటు ఆకట్టుకునే రీతిలో ఒక డాక్యుమెంటరీ చిత్రంను విడుదల చేశారు.
ఆధ్యాత్మిక పరిజ్ఞానం,వ్యక్తిగత అనుభవాలతో కూడిన ఈ పుస్తకాలు, చిత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. స్ఫూర్తిని అందిస్తాయి.
సినిమా,పుస్తకాల విడుదల సందర్భంగా బాపు తన ఆనందాన్ని వ్యక్తం చేసి, శుభప్రదమైన ‘యోగ్’ని సూచించారు. ఈ పుస్తకాలు, చిత్రం విడుదల చేసిన 2024 జూలై 21 వ తేదీకి ఒక ప్రత్యేకత వుంది.

అదేమిటంటే అద్భుతమైన 12 జ్యోతిర్లింగ రామ కథా యాత్రను ప్రారంభించడానికి యాత్రికులు కేదార్నాథ్ చేరుకుని తమ యాత్రని సరిగ్గా సంవత్సరం క్రితం అంటే 2023 జూలై 21న వారు యాత్ర ప్రారంభించారు.
డాక్యుమెంటరీ చిత్రం : రైలులో మొరారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామ కథా యాత్ర
ఆధ్యాత్మిక వేత్త మొరారీ బాపు, ద్వాదశ జ్యోతిర్లింగ రామ కథా యాత్రపై ఒక గంట డాక్యుమెంటరీ చిత్రం ద్వారా , జూలై-ఆగస్టు 2023లో అతను, అతని 1008 మంది అనుచరులు చేపట్టిన విశేషమైన తీర్థయాత్రను అందంగా పొందుపరిచారు.
రెండు రైళ్లలో ఒకదానిలో ప్రయాణించిన ప్రత్యేక బృందం, నెలల తరబడి ఈ చిత్రం చిత్రీకరించింది. ఇది భక్తులు,మొరారీ బాపు ,అభిప్రాయాలతో సహా ప్రయాణంలోని అన్ని ప్రధాన
ముఖ్యాంశాలను స్పష్టంగా ఒడిసిపట్టింది.

ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక యాత్ర పన్నెండు జ్యోతిర్లింగాల పవిత్ర మార్గాన్ని కవర్ చేసింది, ఇవి శివునికి అంకితం చేసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు.
ఈ ప్రయాణం 18 రోజుల పాటు 12,000 కిలోమీటర్లు విస్తరించి వుంది, మంచుతో నిండిన హిమాలయ శిఖరాల మీదుగా పచ్చని లోయలు,విశాలమైన సముద్ర తీరాల వరకు ఈ యాత్ర సాగింది.
మొరారీ బాపు,ఆయన భక్తులు గుజరాత్లోని భావ్నగర్లోని మహువ జిల్లాలోని అతని స్వగ్రామమైన తల్గజరడలోని చిత్రకూట్ధామ్లో డాక్యుమెంటరీ ప్రీమియర్ను వీక్షించారు.
పుస్తకాల గురించి
- జర్నీ విత్ యాన్ ఇన్విజిబుల్ పవర్ ( ఒక అదృశ్య శక్తితో ప్రయాణం) : “జర్నీ విత్ యాన్ ఇన్విజిబుల్ పవర్” అనేది పన్నెండు జ్యోతిర్లింగాల చారిత్రాత్మక తీర్థయాత్రను వివరించే విశేషమైన యాత్రా గ్రంథం. మొరారీ బాపు, యాత్రికులు ప్రతి జ్యోతిర్లింగం వద్ద దైవ దర్శనాన్ని కోరుకున్నారు. రామ్ కథ, ఆధ్యాత్మిక ప్రసంగంలో మునిగిపోయారు. ప్రతి పవిత్ర స్థలానికి సంబంధించిన కథలు, జానపద కథలు, ఇతిహాసాలను బాపు వెల్లడించారు.

ప్రతి గమ్యం, సారాంశాన్ని అన్వేషిస్తూ, దేవాలయాలతో ముడిపడి ఉన్న చరిత్ర, వాస్తు శైలి, ఇతిహాసాలను పరిశోధిస్తూ సాగే ఈ పుస్తకం ప్రయాణంలోని కవితా సౌందర్యాన్ని అద్భుతంగా సంగ్రహిస్తుంది.
మొరారీ బాపు అనుసరించిన విధానాన్ని ఇది మొట్టమొదటిసారిగా ఆవిష్కరిస్తుంది. ప్రయాణం గురించి బాపు స్వంత ప్రయాణంలోని అనేక కోణాలను నిశితంగా ఈ పుస్తకం పరిశీలిస్తుంది.
ఈ పుస్తకం అమెజాన్ ఇండియాలో https://www.amazon.in/dp/9364524829?ref=myi_title_dp వద్ద అందుబాటులో ఉంది.
- సాక్రెడ్ స్టోరీస్ ఫ్రమ్ ది 12 జ్యోతిర్లింగాస్ ( 12 జ్యోతిర్లింగాల నుంచి పవిత్రమైన కథలు) : వినూత్నమైన 12 జ్యోతిర్లింగ రామ్ కథా యాత్రను అనుసరించి, మొరారీ బాపు తన అనుచరులను భౌతికంగా ప్రయాణించినా వారి అనుభవాలను పంచుకోవడానికి ఆహ్వానించారు. వారు తమ అనుభవాలను హిందీ,ఇంగ్లీషు రెండింటిలోనూ చెప్పేందుకు అంగీకరించారు. భక్తుల విభిన్న అనుభవాలను సంగ్రహించే హృదయపూర్వక కథనాల భాండాగారాన్ని ఇది సృష్టించింది.

ఈ పుస్తకాన్ని వైవిధ్యంగా ఉంచేది ప్రామాణికత పట్ల దాని నిబద్ధత. వాస్తవిక భావాలు,వ్యక్తిగత అనుభవాలను సంరక్షిస్తూ, భక్తుల భాష,భావోద్వేగాల వెల్లడి కి ఎటువంటి మార్పు లేకుండా అలాగే పుస్తకం లో ప్రచురించాయి. ప్రతి కథనం భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంను సంపూర్ణంగా ఒడిసిపడుతుంది.
ఈ సంకలనం దైవిక అనుసంధానం,అంతర్గత మేల్కొలుపు, సార్వత్రిక అన్వేషణను వేడుక జరుపుకుంటుంది. ఇది భక్తి భావంలోని అందాన్ని, మహాదేవ్, దయ ఆశీర్వాదాలను సాధకులు అనుభవించే అనేక మార్గాలను ప్రదర్శిస్తుంది.
పుస్తకం అమెజాన్ ఇండియాలో https://www.amazon.in/dp/9364524055?ref=myi_title_dp వద్ద అందుబాటులో ఉంది.
ఇదికూడా చదవండి: భారతదేశ వ్యాప్తంగా ‘ఇసుజు ఐ-కేర్ మాన్సూన్ క్యాంప్’ని ప్రారంభించనున్న ఇసుజు మోటర్స్ ఇండియా
Also read: IDBI Bank Limited – Financial Results for Q1 of FY 2025IDBI Bank reports 40% rise in profits on YoY basis
Also read: Introducing New Firmware and Applications for 4K Remote PTZ Camera Systems Including a Lite Version for Auto Tracking
ఇదికూడా చదవండి: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పాటించాల్సిన సూచనలు..
Also read: Time to further enhance collaboration between the state governments and industry to uplift Oil Palm farmers
Also read: OPPO India Enters Record Books with the Reno12 Series for Most AI Avatars Created in a Day.
ఇదికూడా చదవండి:పారిస్ ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న భారత జట్టుకు 8.5 కోట్లు ఇచ్చిన బీసీసీఐ.