365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 14, 2024: నాణ్యత, విశ్వాసానికి బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ ప్రతీక అని సినీ నటి ఐశ్వర్య మీనన్ తెలిపారు.హైదరాబాద్‌ లోని నోవాటెల్ హెచ్ఐసీసీలో 474వ గ్రాండ్ టాలెంట్ అవార్డుల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గ్రూప్ ఇళ్లను నిర్మించడమే కాకుండా భవిష్యత్తును నిర్మించడంలో కూడా‌ ముందుందని చెప్పారు.

బీబీజీ బృందం అంకితభావం ప్రశంసనీయం అన్నారు. మహిళా సాధికారత పట్ల చూపిస్తన్న శ్రద్ధ అమోఘమన్నారు. వ్యాపారంతో పాటు సమాజం పట్ల ఉన్న బాధ్యతకు ఇది నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సీఎండీ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ బీబీజీ బంగారు తల్లి లక్ష్యం మహిళలను ఉన్నత స్థానంలో చూడటమేనన్నారు.

అందులో భాగంగా 2040 నాటికి ఇరవై లక్షల మంది మహిళలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక వ్యాపారంలో ఇప్పటి వరకు 240 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. లక్షా ఇరవై ఐదు వేల మంది కస్టమర్ల కళ్లలో ఆనందాన్ని చూశామన్నారు.

2040 నాటికి మరో 10 లక్షల మంది భారతీయులు సొంతంగా ప్లాట్లను పొందేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు.అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు బీబీజీ పెట్టింది పేరన్నారు. బీబీజీ ప్రజలు కంటున్న కలలు, నమ్మకాలకు ఆసరాగా ఉందన్నారు.

పారదర్శకతతో కలల గృహాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సినీ నటి ఐశ్వర్య మీనన్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్కీ డీప్ ద్వారా బహుమతులు ఇచ్చారు.