365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూ ఢిల్లీ,మార్చి 10,2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని 13 వేదికల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లు త్వరలోనే భారతదేశానికి రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఐపీఎల్ చైర్మన్‌కు ఒక ముఖ్యమైన లేఖ రాసింది.

పొగాకు, మద్యం ప్రకటనలు ప్రదర్శించొద్దని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఐపీఎల్ చైర్మన్‌కు రాసిన లేఖలో టోర్నమెంట్ సమయంలో పొగాకు,మద్యం ప్రకటనలను ప్రదర్శించరాదని స్పష్టం చేసింది.

Read this AlsoChiranjeevi Honours Actress Sreeleela on the Sets of Vishwambhara

ఇది కూడా చదవండి…మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా శ్రీలీలకు ప్రత్యేక సన్మానం

ఇది కూడా చదవండి…విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా..?

లేఖలో పేర్కొన్నట్లుగా – “భారతదేశంలో క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి అనేక రోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణంగా పొగాకు, మద్యపానం నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వల్ల మరణించే వారి సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. అంతేగాక, మద్యం వల్ల దేశంలో ప్రతి ఏడాది సుమారు 14 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.”

ఐపీఎల్ ఈవెంట్లలో పొగాకు ఉత్పత్తుల, మద్యం విక్రయాలపై కూడా నిషేధం
లేఖలో ఇంకా ఐపీఎల్‌కు సంబంధించిన ఇతర కార్యక్రమాల్లోనూ పొగాకు, మద్యం ఉత్పత్తుల విక్రయాలను కూడా నిషేధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్: కోల్‌కతా నైట్‌రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరు జరగనుంది.

Read this Also: Training classes for women journalists on online journalism under the auspices of the Telangana Media Academy..

Read this AlsoEating Apples for a Healthier Heart: The Natural Way to Lower Cholesterol..

Read this Also: India Aims for ICC Champions Trophy Glory Against New Zealand..

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోల్‌కతా హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనుంది. రెండో రోజే ప్రేక్షకులకు డబుల్ హెడర్ మ్యాచులు మరింత మజాను అందించనున్నాయి.

ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో
ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో మొదటి క్వాలిఫైయర్ మే 20న, ఎలిమినేటర్ మే 21న హైదరాబాద్‌లో జరుగనున్నాయి. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ మే 23న, ఇక అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది.