365తెలుగు డాట్ కామ్ న్యూస్, ఏప్రిల్ 23,2025:జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో నిన్న జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లో వైమానిక దాడుల భయం నెలకొంది. ఈ దాడిలో పలువురు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్‌తో పాటు ఉన్నత సైనిక, ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి…₹12,800 కోట్లతో రెండు అణు రియాక్టర్లు నిర్మించనున్న ఎంఈఐఎల్..

Also read this…Airtel to Acquire 400 MHz Spectrum in 26 GHz Band from Adani Data Networks..

ఇది కూడా చదవండి…బతుకమ్మ కుంటలో అభివృద్ధి పనులకు కమిషనర్ శంకుస్థాపన..

పహల్గామ్ దాడికి పాకిస్థాన్ మద్దతునిచ్చిన ఉగ్రవాద సంస్థలే కారణమని భారత్ ఆరోపిస్తోంది. ఈ దాడి తర్వాత భారత వైమానిక దళం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రధాని మోదీ ఉగ్రవాదంపై గట్టి సందేశం ఇస్తూ, దేశ భద్రతకు ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.