365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,మే 20,2025: పాకిస్తాన్ కోసం భారతదేశం లో గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ టీవీ నటి రూపాలి గంగూలీ తీవ్రంగా స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తన సూటి, స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంది రూపాలి గంగూలీ, దేశానికి సంబంధించిన ఏ విషయంపైనైనా తన గళం వినిపించడానికి ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా జ్యోతి మల్హోత్రా అరెస్ట్ వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు చూస్తుంటే ఆమె ఎంతగా కలత చెందారో అర్థమవుతోంది.
రూపాలి గంగూలీ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తూ, “ఇలాంటి వ్యక్తులు పాకిస్తాన్ పట్ల తమకున్న ప్రేమను భారతదేశం పట్ల ద్వేషంగా ఎప్పుడు మార్చుకుంటారో వారికే తెలియదు. మొదట ‘శాంతి కోసం ఆశ’ అంటూ మాట్లాడతారు, చివరికి భారతదేశాన్ని ద్వేషించడం ప్రారంభిస్తారు.
ఇది కూడా చదవండి…విశాఖ తీరంలో యోగా మహా సంగమం.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథి..!
Read This also…From Fields to Flavors: Godrej Food Trends 2025 Highlights India’s Return to Roots..
దేశానికి వ్యతిరేకంగా రహస్యంగా పనిచేస్తున్న ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. #జ్యోతి మల్హోత్రా” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

‘అనుపమ’ సీరియల్తో ఇంటింటా గుర్తింపు పొందిన రూపాలి గంగూలీ, దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదని తన మాటల ద్వారా స్పష్టం చేశారు.
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను హిసార్ పోలీసులు అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్లు 3, 4 , 5 , భారత శిక్షాస్మృతి (BNS)లోని సెక్షన్ 152 కింద అరెస్టు చేశారు. ఆమె పాకిస్తాన్కు కూడా ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు.
Read This also…IndusInd Bank Signs MoU with DPIIT to Boost India’s Startup Ecosystem..
Read This also…Vi Launches New Campaign Celebrating the Addition of 1 Lakh Towers in Just 6 Months..
ఇదిలా ఉండగా, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్లో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను రూపాలి గంగూలీ సమర్థించారు. అంతేకాకుండా, భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రముఖులపై ఆమె తన కోపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూపాలి గంగూలీ ‘అనుపమ’ సీరియల్లో నటిస్తున్నారు.