365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే20,2025: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) నిర్వహించిన చారిత్రాత్మక పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ మే 31న రజతోత్సవాలు నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీజేఎఫ్ అధ్యక్షులు అల్లం నారాయణ తెలిపారు. 2001 మే 31న ఆరంభమైన టీజేఎఫ్, తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు అంటే 2014 వరకు అనేక సందర్భాల్లో ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన అన్నారు.
వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ కీలకమైన పాత్ర పోషించిందని అల్లం నారాయణ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి…జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త ట్విస్ట్ – పూరీ యూట్యూబర్తో సంబంధాలు, పహల్గామ్ లింకులు..
ఇది కూడా చదవండి…‘దేశద్రోహులను వదలొద్దు’ – గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రాపై రూపాలి గంగూలీ ఆగ్రహం..
మాక్ అసెంబ్లీ, ఛలో ఢిల్లీ, సాగర హారం, అసెంబ్లీ ముట్టడి వంటి ఉద్యమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన ఘనత టీజేఎఫ్కే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఉద్యమం ఎక్కడ నీరుగారిపోతున్నా, టీజేఎఫ్ తన క్రియాశీలక పాత్రతో ఉద్యమాన్ని ముందుకు నడిపించిందని అల్లం నారాయణ గుర్తు చేశారు.

ఈ ఉద్యమ ప్రస్థానంలోని అనేక ముఖ్యమైన విషయాలను నేటి తరానికి మరోసారి తెలియజేయడానికి ఈ నెల 31న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అల్లం నారాయణ వెల్లడించారు.
తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ చేసిన ఉద్యమం ఇతర ఉద్యమాలకు ఒక దిక్సూచిలాంటిదని టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ అభివర్ణించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీజేఎఫ్ రజతోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.
ఇది కూడా చదవండి…విశాఖ తీరంలో యోగా మహా సంగమం.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథి..!
Read This also…From Fields to Flavors: Godrej Food Trends 2025 Highlights India’s Return to Roots..
ఈ కార్యక్రమంలో అల్లం నారాయణ, చంటి క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, ఎ. రమణ కుమార్, పి.శశికాంత్, ఎం.వి.రమణ, కోశాధికారి పి.యోగానంద్, జాయింట్ సెక్రటరీ యార నవీన్ కుమార్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రాకేష్ రెడ్డి, సోమేశ్వర్, కోశాధికారి బాబు రావు, కళ్యాణ్ చక్రవర్తి, చిన్న పత్రికల సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగస్టీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.