365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చండీగఢ్, మే 20 2025 : పాకిస్తాన్‌కు గూఢచారి కార్యకలాపాలు నిర్వహించిన ఆరోపణలపై హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 16న హిసార్‌లోని న్యూ అగ్గర్సైన్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతం నుంచి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు.

ట్రావెల్ హిస్టరీపై అనుమానాలు..

33 ఏళ్ల జ్యోతి “ట్రావెల్ విత్ JO” అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు. ఆమె పాకిస్తాన్, చైనా సహా పలు ఇతర దేశాలకు పర్యటనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ట్రావెల్ హిస్టరీతో పాటు ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతికి సాధారణ ఆదాయానికి మించి విదేశీ పర్యటనలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ల్యాప్‌టాప్‌కు ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది. అలాగే, ఆమెతో సంబంధాల్లో ఉన్న వారిని కూడా ప్రశ్నించనున్నారు.

ఇది కూడా చదవండి…కోవిడ్ 19 : భారతదేశంలో వేగంగా పెరుగుతున్నకరోనా కేసులు

ఇది కూడా చదవండి…తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర చిరస్మరణీయం – మే 31న రజతోత్సవాలు..

పాకిస్తాన్ అధికారి పరిచయం, గూఢచారి నెట్‌వర్క్..

2023లో వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్‌ను జ్యోతి సంప్రదించినప్పుడు, అక్కడి అధికారి ఎహ్‌సాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను ‘అస్త్రంగా’ అభివృద్ధి చేయాలని ప్రయత్నించినట్లు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు.

ఇటీవలి కాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి పాకిస్తాన్‌కు గూఢచారి చేస్తున్నారన్న ఆరోపణలపై మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఇది ఉత్తర భారతదేశంలో పాక్ మద్దతుతో నడుస్తున్న ఓ స్పై నెట్‌వర్క్‌గా అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి…జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త ట్విస్ట్ – పూరీ యూట్యూబర్‌తో సంబంధాలు, పహల్గామ్ లింకులు..

ఇది కూడా చదవండి…‘దేశద్రోహులను వదలొద్దు’ – గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రాపై రూపాలి గంగూలీ ఆగ్రహం..

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లే లక్ష్యం..

ఇది ఆధునిక యుద్ధ శైలి అని ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ పేర్కొన్నారు. “ఇది సరిహద్దుల్లో మాత్రమే సాగేది కాదు. సోషల్ మీడియా ద్వారా కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తమ గూఢచారి కార్యకలాపాలకు లక్ష్యంగా చేసుకుంటున్నారు” అని ఆయన తెలిపారు. ఈ అరెస్ట్‌తో సోషల్ మీడియా వినియోగదారులు, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్‌లు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.