365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 25, 2025: నగరంలోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ అయిన శరత్ సిటీ మాల్ (AMB మాల్, కొండాపూర్)లో వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ను ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ హాజరై మరింత రంజుగా మార్చారు. ఈవెంట్ మే 23న ప్రారంభమై, మే 25 వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ, “ఇది ఒక బంగారు వేడుక. ఈవెంట్ అద్భుతంగా, రంగులమయం గా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి మరిచిపోలేని అనుభూతిని ఇస్తాయి. వింధ్య గోల్డ్ లాంటి విశ్వసనీయ బ్రాండ్ దీనిని నిర్వహించడం విశేషం. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్తుకి బంగారు భరోసా లాంటిది” అని తెలిపారు. ఈషా రెబ్బ అభిమానులతో ముచ్చటించి ఫోటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు.

Read This also…Eesha Rebba Brings Star Power to Viindya Gold..
ఇది కూడా చదవండి…ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్లో కొత్త అధ్యాయం : హార్మొనీ డైరెక్ట్ 2.0ను విడుదల చేసిన ఎక్సికామ్
ఇది కూడా చదవండి…చెరువును కాపాడిన..హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆత్మీయ సత్కారం..
ఈవెంట్లో గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్ విభాగం సందర్శకులను ఆకర్షించింది. ఇందులో పాల్గొన్న విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ప్రత్యేకంగా నిలిచింది.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్, ఈవెంట్ ద్వారా తన విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈవెంట్కి హాజరై విజయవంతం చేశారు. నిర్వాహకులు ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.