365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 31,2025: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న K. సీతాలక్ష్మి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతాలక్ష్మిని రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch. విద్యాసాగర్ ఘనంగా సన్మానించారు.
ఆమె చేసిన సేవలను ఉద్యోగులు ఈ సందర్భంగా కొనియాడారు. తన 28 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అంకితభావంతో విశ్వవిద్యాలయంలో సేవలు అందించారన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ నిబద్ధతగా కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు లభిస్తుందని అన్నారు.
ఇది కూడా చదవండి…వరద సమస్య పరిష్కారం కోసం హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్త పరిశీలన..
ఇది కూడా చదవండి…ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం –పొగాకు బాలల భవితకు ముప్పు

ఇది కూడా చదవండి…‘ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేక ఫెలోషిప్ బోధనా కార్యక్రమం ప్రారంభం
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సీతా లక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.