365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,జూన్ 2,2025 : 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన “గ్రామ గ్రామాలకు నాణ్యమైన విత్తనం” కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎంపికైన 10 మంది అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తన కిట్లను అందజేశారు.
అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేణు నరేందర రెడ్డి , విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య, ఇబ్రాహింపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (IAS) ల సమక్షంలో ఎంపికైన 10 మంది అభ్యుదయ రైతులకు విశ్వవిద్యాలయం తయారుచేసిన నాణ్యమైన విత్తన కిట్లు పంపిణీ చేయబడినాయి.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాసనసభ్యుల సమక్షంలో సుమారు 300 మంది అభ్యుదయ రైతులకు ఈ విత్తన కిట్లు పంపిణీ చేయబడ్డాయి.
భువనగిరి లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వికారాబాద్ లో శాసన సభా పతి గడ్డం ప్రసాద కుమార్, వరంగల్ జిల్లా లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కరీంనగర్ లో దుద్దిళ్ళ ధర్బాబు, సంగారెడ్డి లో దామోదర రాజనరసింహ, హనుమకొండ జిల్లాలో శ్రీమతి కొండా సురేఖ, ములుగు జిల్లాలో శ్రీమతి సీతక్క, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు, సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్, నాగర్ కర్నూలు జిల్లాలో జీ. చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మంచిర్యాల జిల్లాలో శ్రీ హర్కర వేణుగోపాల్ తదితరులు విత్తనాల పంపిణీలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
ఇది కూడా చదవండి…SSPL – దక్షిణభారతదేశపు అతిపెద్ద టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెస్టివల్..
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ విస్తృత కార్యక్రమంలో సుమారు 11,000 గ్రామాల్లోని 40,000 మంది అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలను గ్రామాల వరుసగా పంపిణీ చేయడం జరుగుతుంది.
ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా వివిధ జిల్లాల్లో విత్తనాలు అందుకున్న సుమారు 300 మంది రైతులు భాగస్వాములు అయ్యారు. మిగతా ఎంపికైన రైతులకు మూడు రోజుల లోపు స్థానిక రైతు వేదికల ద్వారా ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు సమక్షంలో విత్తనాలు అందజేయనున్నారు.
Read This also…SSPL Grand Launch: South India’s Biggest Tennis Ball Cricket League..
ఇది కూడా చదవండి…టొవినో థామస్ ఎమోషనల్ సీన్లలో ప్రేక్షకులని కట్టిపడేసిన “నరివెట్ట” చిత్రం..!

ఈ కార్యక్రమాన్ని ముందుండి పర్యవేక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన రావు , వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపీ, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికీ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.