365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 7,2025: పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రీమియం సంప్రదాయ దుస్తుల బ్రాండ్ పి & ఎస్ కో, తెలంగాణలో తమ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని జివికె మాల్‌లో ప్రారంభించింది.

ఒక అభిరుచి నుంచి జాతీయ గుర్తింపు పొందిన బ్రాండ్‌గా..


పూజా బిహాని కనోరియా (ఎండీఐ గురుగావ్ నుంచి మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్) సలౌని గుప్తా బిహాని (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ – నిఫ్ట్ అలుమ్నా), ఇద్దరు స్నేహితులు కలిసి ప్రారంభించిన పి & ఎస్ కో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ బ్రాండ్ సహ-వ్యవస్థాపకురాలు సలౌని గుప్తా స్వతహాగా హైదరాబాదీ కావడం విశేషం.

ఈ బ్రాండ్‌ను ఇప్పటికే అంబానీలు, పిరమళ్లు, అదానీలు, జీవీకే కుటుంబాలు వంటి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల కుటుంబాలు, బాలీవుడ్ ప్రముఖులు షాహిద్ కపూర్, అనుష్క శర్మ, క్రికెట్ స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, గౌతమ్ గంభీర్, ఉమేష్ యాదవ్ పిల్లలు ధరించారు. అంతేకాకుండా, యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కుటుంబం కూడా ఈ బ్రాండ్‌ను ప్రశంసించింది.

హైదరాబాద్‌లో కొత్త స్టోర్, భవిష్యత్ ప్రణాళికలు..

హైదరాబాద్‌లోని ఈ నూతన స్టోర్‌ను రాపిడ్ కార్ప్ అనే మాస్టర్ ఫ్రాంచైజీ ద్వారా ప్రారంభించారు. ఈ ఫ్రాంచైజీని హైదరాబాద్‌లో తల్లి-కుమార్తె ద్వయం, శ్రీమతి లతా అగర్వాల్ మరియు శ్రీమతి అక్షిత నహార్ నిర్వహిస్తున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక చిగురుపాటి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, “పిల్లల దుస్తులలో కట్, ఫిట్, కంఫర్ట్, వ్యక్తిగత స్టైల్ చాలా ముఖ్యమైనవి. పి & ఎస్ కో ఈ అంశాలను చక్కగా అర్థం చేసుకుని నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోంది. నేను త్వరలో తల్లిని కాబోతున్నాను కాబట్టి, ఈ బ్రాండ్‌ను దగ్గరగా గమనిస్తున్నాను,” అని పేర్కొన్నారు.

Read This also…Get Ready for the Ultimate Knockout: Blockbuster Malayalam Film “Alappuzha Gymkhana” Premieres June 13, Only on Sony LIV

ఇది కూడా చదవండి…మహిళా ఎస్సైపై దాడి కేసులో ఏడుగురు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..

ఫ్రాంచైజీ భాగస్వామి అక్షిత నహార్ మాట్లాడుతూ, “నేను ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో పిల్లల కోసం మంచి ఎథ్నిక్ వేర్ స్టోర్ (సాంప్రదాయ దుస్తుల దుకాణం) లేదని గమనించాను. అందుకే ఈ విభాగంలోకి రావాలని నిశ్చయించుకున్నాను,” అని తమ నిర్ణయం వెనుక గల కారణాన్ని వివరించారు.

పి & ఎస్ కో ఇప్పటివరకు కోల్‌కతా కేంద్రంగా మాత్రమే కార్యకలాపాలు నిర్వహించేది. ఇప్పుడు తొలిసారిగా ఇతర నగరానికి విస్తరించడం ద్వారా ఒక మైలురాయిని చేరుకుంది.

సంస్థాపకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో మేము నిర్వహించిన ఎగ్జిబిషన్‌లలో దేశంలోని మరే నగరంలోనూ లేని అద్భుతమైన స్పందన కనిపించింది. ఇక్కడ ప్రీమియం కిడ్స్ వేర్‌కు మంచి డిమాండ్ ఉందని గుర్తించాం. అందుకే మా మొదటి స్టోర్‌ను ఇక్కడే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం,” అని తెలిపారు.

పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ డిజైన్లు సంస్కృతి ,ఆధునికత కలయిక అని, దీపావళి వంటి పండుగలనుండి కుటుంబ వేడుకల వరకు ప్రతి చిన్న సందర్భానికీ సరిపోతాయని వారు వివరించారు. “ప్రతి చిన్న దుస్తువు వెనుక ఒక కథ ఉంటుంది. మేము ఆ క్షణాలను గుర్తుంచుకుని ప్రేమతో, నైపుణ్యంతో దుస్తువులను రూపొందిస్తున్నాం,” అని సంస్థాపకులు స్పష్టం చేశారు.

పి & ఎస్ కో ఇప్పుడు భారతదేశపు నంబర్ వన్ కిడ్స్ ఎథ్నిక్ వేర్ బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యంతో, తదుపరి ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు మరియు మధ్యప్రాచ్యంలో విస్తరణను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తోంది. అంతర్జాలం ద్వారా గ్లోబల్ మార్కెట్‌కు సులభంగా చేరుకోగలిగేలా తమ డిజిటల్ ఉనికిని కూడా పెంచుతోంది.

హైదరాబాద్‌లో ఈ కొత్త స్టోర్ ప్రారంభంతో, పి & ఎస్ కో బ్రాండ్ “సాంప్రదాయం మరియు స్టైల్‌ను ఒకే చిన్న దుస్తువులో సమ్మిళితం చేసే” తమ ప్రయాణంలో మరో ముఖ్య ఘట్టాన్ని చేరుకుంది.