365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 11,2025: వర్షాకాలం ప్రారంభం కావడంతో నగరంలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి హైడ్రా (HYDRA) ముందంజ వేసింది. ఈ నేపథ్యంలో 130 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి బృందంలో 12 మంది సభ్యులు ఉంటారు.

ఇది కూడా చదవండి..‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ – ఉపాసనా కామినేని ప్రారంభించిన ఫ్యూజిఫిల్మ్ ఇండియా అవగాహన కార్యక్రమం

Read This also…FUJIFILM India Launches Nationwide Breast Cancer Awareness Campaign with Upasana Kamineni Konidela as Ambassador

అదనంగా, హైడ్రాకు చెందిన 51 DRF (Disaster Response Force) బృందాలు కూడా ఈ ప్రయత్నంలో భాగమవుతున్నాయి. ప్రతి DRF టీమ్‌లో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ రెండు బృందాలు సమన్వయంగా పనిచేసేలా హైడ్రా అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నారు. వర్షానికి నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, నీటిని తొలగించి వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా చేయడమే ప్రధాన లక్ష్యం.

GHMC పరిధిలో పూడిక తీత బాధ్యత

వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత హైడ్రాకు అప్పగించింది. అయితే, మురుగు కాలువల్లో పూడిక తీయడం, చెత్త తొలగింపు వంటి పనులు GHMC పరిధిలోనే కొనసాగుతాయి అని మున్సిపల్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

అయితే అవసరమైతే, GHMC కు హైడ్రా అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటుంది. తక్షణ స్పందన, వరద నివారణ చర్యల్లో హైడ్రా కీలకపాత్ర పోషించనుంది.

Read This also…Volkswagen Virtus Celebrates Three Successful Years as India’s Leading Premium Sedan

Read This also…Shreyas Iyer Responds to India Captaincy Rumors and Contract Setback..

ఇదే తరహాలో, మాన్సూన్‌ సమయంలో నగరంలో చురుకైన చర్యలు తీసుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశ్యం.