365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 13,2025: నాలాల్లో పేరుకుపోయిన చెత్తను, పూడికను వేగంగా తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. నాలాల్లో ఎక్కడా అడ్డంకులు లేకుండా చూడాలని, నాలా ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.

శుక్రవారం చింతల్‌బస్తీ మీదుగా వెళ్లే బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12, పింఛను ఆఫీసు వద్ద 15 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలా చింతల్‌బస్తీ వైపు 7 మీటర్ల మేర కబ్జాలకు గురైందని, వాటిని బుధవారం హైడ్రా తొలగించిందని తెలిసిందే.

Read This also…IndiGo Launches New Direct Flights from Bhubaneswar to Abu Dhabi and Visakhapatnam

Read This also…IFL Enterprises to Launch ₹49.14 Crore Rights Issue on June 19, 2025

అయితే, ఆక్రమణలు తొలగించినా, కబ్జాల వల్ల కల్వర్టు కింద సగం భాగం పూడికతో నిండిపోయింది. ఈ పూడిక తీతతో పాటు, కబ్జాల తొలగింపు పనులు కూడా వేగంగా జరగాలని కమిషనర్ ఆదేశించారు.

జేసీబీల సాయంతో కాలువలోని చెత్తనంతా తొలగించాలని సూచించారు. వరద నీటికి ఎలాంటి ఆటంకం లేకుండా, నాలా ఇతర ప్రాంతాల్లో కూడా కబ్జాలు ఉంటే వాటిని తొలగించాలని ఆదేశించారు.

Read This also…MIPS and Cyient Semiconductor Partner for Custom RISC-V Solutions in AI Power Delivery, Industrial Robotics, and Automotive

Read This also…Hyderabad Gets India’s First Intelligent Blood Delivery Platform with Lytus BLOD

శంకర్‌పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి వచ్చే ఈ చారిత్రక బుల్కాపూర్ నాలా, మియాఖాన్ గడ్డ, జన్వాడ, ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, రాయదుర్గం, ఓయూకాలనీ, షేక్‌పేట, బీజేఆర్ నగర్, మహాత్మాగాంధీనగర్, హఖిమ్సా విరాట్‌నగర్, బృందావన్ కాలనీ, టోలిచౌకి, మెహిదీపట్నం మిలటరీ ఏరియా, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12, చింతల్‌బస్తీ, తుమ్మలబస్తీ, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు వరద నీటిని తీసుకువస్తుంది.