365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 18,2025 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా గ్రామంలో అవినీతి కలకలం రేపింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి ₹8,000 లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఓ స్థానిక నివాసితుడు తనకు చెందిన ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్ కేటాయించడంతో పాటు వాటర్ సర్వీసింగ్ షెడ్‌కు అనుమతి కోరాడు. దీనికి ప్రతిఫలంగా కార్యదర్శి రూ.8,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

బాధితుడు ఈ విషయాన్ని సంబంధిత అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయగా, వారు పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి లంచం తీసుకుంటున్న సమయంలో ఆమెను పట్టుకున్నారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థులు ఈ అవినీతి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు.