365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 19,2025: ZEE5 మరో విభిన్నమైన సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్సిరీస్ను తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తోంది. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఈ ఉత్కంఠభరితమైన వెబ్సిరీస్ను దర్శకుడు కృష్ణ పోలూరు తెరకెక్కించగా, సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీరామ్ నిర్మించారు. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 27 నుండి ZEE5లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్లోని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించగా, ప్రముఖ నటుడు నవీన్ చంద్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.
ట్రైలర్ లింక్: https://youtu.be/TYU8OwKM-mk
ప్రెస్ మీట్ లైవ్: https://youtu.be/sQWoUBanW9M
ఇవే ట్రైలర్ లాంచ్ వేళ పలుకులు
నవీన్ చంద్ర మాట్లాడుతూ –
“విరాటపాలెం పోస్టర్ చూసినప్పుడే ఆసక్తి కలిగింది. ‘రెక్కీ’ నా ఫేవరెట్ సిరీస్. అదే దర్శకుడు ‘విరాటపాలెం’ తీస్తున్నారని తెలియగానే ఇంకా ఎగ్జైట్ అయ్యాను. అభిజ్ఞ పాత్రకు న్యాయం చేస్తారు. ఈ ట్రైలర్ మూడ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సిరీస్ తప్పకుండా విజయవంతం అవుతుంది” అని చెప్పారు.

నిర్మాత శ్రీరామ్ –
“రెక్కీ తర్వాత చాలానే కథలు విన్నా, కానీ దివ్య గారు చెప్పిన ఈ కథనే నన్ను వెంటాడింది. జీ5కు ఈ కథను తీసుకెళ్లడంలో అనురాధ మేడం పెద్ద సహకారం అందించారు. అభిజ్ఞ, కృష్ణ గారు తమ పనితీరు ద్వారా ప్రాజెక్ట్ను మరో స్థాయికి తీసుకెళ్లారు. 80ల కాలం అద్భుతంగా ప్రతిబింబించబడింది” అన్నారు.
దర్శకుడు కృష్ణ పోలూరు –
“రెక్కీ తర్వాత మళ్లీ ZEE5తో పని చేయడం గర్వంగా ఉంది. విరాటపాలెం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కథకు సరిగ్గా సరిపోయే విజన్తో పనిచేశాం” అని తెలిపారు.
నాయిక అభిజ్ఞ వూతలూరు –
“మూఢనమ్మకాలపై పోరాడే మహిళ పాత్ర చేయడం చాలా ప్రత్యేక అనుభూతి. దివ్య గారు రాసిన కథలో బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. శ్రీరామ్ గారు నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చారు. ZEE5 మాదిరి ప్లాట్ఫాంపై అలాంటి కంటెంట్ రావడం హర్షణీయం” అన్నారు.
Read This also…Viraatapalem Trailer Unveiled by Naveen Chandra
ఇది కూడా చదవండి…జూలై 4 నుంచిస్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్న “ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు” – సోనీ లివ్లో!
చరణ్ లక్కరాజు –
“ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కృష్ణ గారితో పని చేయడం ఓ లెర్నింగ్ ఎక్స్పీరియెన్స్. అభిజ్ఞతో స్క్రీన్ షేర్ చేయడం చాలా బాగుంది” అన్నారు.
కెమెరామెన్ మహేష్ స్వరూప్ –
“రెక్కీ తర్వాత మళ్లీ బలమైన కథతో రాబోతున్నాం. విజువల్ టోన్, థీమ్ అద్భుతంగా ఉండబోతుంది” అన్నారు.
కథా రచయిత దివ్య –
“ఇది నా తొలి వెబ్సిరీస్ ప్రాజెక్ట్. ఇది 80ల కాలంలో జరగడం విశేషం అయినా ఇప్పటికీ రీలవెంట్గా అనిపిస్తుంది. మూఢనమ్మకాలు ఎలా సమాజాన్ని ప్రభావితం చేస్తాయో చూపించబోతున్నాం” అన్నారు.

ZEE5 కంటెంట్ హెడ్ సాయి తేజ్ –
“రెక్కీ ZEE5లో టాప్ హిట్. విరాటపాలెం ఆ స్థాయిని అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీగా కూడా తీసుకురావాలని భావిస్తున్నాం. అభిజ్ఞ నటన, దివ్య కథ, కృష్ణ గారి విజన్ – ఇవన్నీ కలిసి సిరీస్ను బలంగా తీర్చిదిద్దాయి. ఇది ఫ్యామిలీతో బింజ్ వాచ్ చేయదగ్గ కంటెంట్” అన్నారు.
Read This also…The Hunt: The Rajiv Gandhi Assassination Case comes alive, streaming from 4th July on Sony LIV!
Read This also…ZEE5 Unveils ‘Viraatapalem: PC Meena Reporting’ – A Gripping Telugu Supernatural Thriller Premiering June 27
ప్రేక్షకులకు సూచన
‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ – మూఢనమ్మకాలపై ప్రశ్నలే గుబురుగా మారే కథను మీరు మిస్ అవకండి! జూన్ 27 నుంచి ZEE5లో మాత్రమే స్ట్రీమింగ్.