365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, జూన్ 29, 2025: ప్రముఖ ఆభరణాల బ్రాండ్ కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్లో తమ విస్తరణ ప్రణాళికలను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో తమ మూడవ ఎక్స్క్లూజివ్ షోరూమ్ను విజయవాడలోని సిద్ధార్థ నగర్లో ఘనంగా ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా హాజరయ్యారు.
వినియోగదారులకు ఆఫర్ల వర్షం..
అత్యంత శుభప్రదమైన రథయాత్ర పండుగ సందర్భంగా ప్రారంభమైన ఈ షోరూమ్, వినియోగదారులకు ఆకర్షణీయమై న ఆఫర్లను అందిస్తోంది. వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 100% వరకు తగ్గింపు, బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును కిస్నా ప్రకటించింది. అంతేకాకుండా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 5% తక్షణ తగ్గింపు లభిస్తుంది.
దక్షిణాది మార్కెట్పై కిస్నా దృష్టి..
ఈ సందర్భంగా హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు & మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ, “దక్షిణ భారతదేశంలోని కీలక మార్కెట్లలో విజయవాడ ఒకటి. ఈ షోరూమ్ మా వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంతో పాటు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా, వినియోగదారుల-ఆధారిత విధానంతో వ్యాపార అవకాశాలను తెరుస్తుంది.
‘హర్ ఘర్ కిస్నా’ అనే మా లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల బ్రాండ్గా, ప్రతి మహిళకు వజ్రాల ఆభరణాలను సొంతం చేసుకునే కలను నిజం చేస్తున్నాము” అని అన్నారు.
ప్రాంతీయ అభిరుచులకు ప్రాధాన్యత..
కిస్నా డైరెక్టర్ పరాగ్ షా మాట్లాడుతూ “విజయవాడలో ఈ కొత్త షోరూమ్ ప్రారంభం ద్వారా, ఆంధ్రప్రదేశ్లో మా కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాము. ఈ షోరూమ్లో రోజువారీ ధారణకు, అలాగే ప్రత్యేక సందర్భాలకు అనువైన రీతిలో ప్రాంతీయ అభిరుచులను ప్రతిబింబించే ఆభరణాల విస్తృత శ్రేణి అందుబాటులో ఉంటుంది.

సంప్రదాయ శైలుల నుండి సమకాలీన డిజైన్ల వరకు అందరికీ ఏదో ఒకటి ఇక్కడ లభిస్తుంది. ఇది ఈ ప్రాంతంలోని ఆభరణాల కొనుగోలు దారులకు అసలైన గమ్యస్థానంగా మారుతుంది” అని పేర్కొన్నారు.
స్థానిక భాగస్వామ్యం, సేవా కార్యక్రమాలు..
ఫ్రాంచైజ్ భాగస్వాములు జి సుధాకర్ & బి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “కిస్నా విశ్వసనీయ బ్రాండ్, స్థానిక మార్కెట్పై మాకున్న అవగాహనతో కలిసి, ఈ షోరూమ్ ఆభరణాల వ్యాపారంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది.
సంప్రదాయం, ఆధునిక శైలి రెండింటినీ ప్రతిబింబించే ఉత్పత్తులను అందిస్తాము” అని తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే కిస్నా నిబద్ధతకు అనుగుణంగా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం, నిరుపేదలకు ఆహార పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించారు.