365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 15,2025: యోగా గురు సరోజని రామారావు, లయన్స్ క్లబ్ 320ఎ ఆధ్వర్యంలో ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ ప్రాంగణం నవ్వుల్తో, ఆటల్తో, ఆనందంతో కళకళలాడింది. ప్రత్యేకంగా, పెద్దలు తిరిగి పిల్లలల్లా మారి సంబరాలు చేసుకోవడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో యోగా గురువులు సరోజని, రామారావు, సివియర్ అడ్వకేట్ రాజేంద్ర కుమార్, వెంకటేశ్వర్లు, రాజా నరసింహ , రాజేష్, నాగభూషణం, శ్రీలత, అనితా, ప్రతిమ, రాజ్యలక్ష్మీ, జ్యోతి రాజా, పూర్ణ కుమారి, కృష్ణ వేణి, డా. హిప్నో పద్మా కమలాకర్ యోగా సాధకులు పాల్గొన్నారు.

ఉదయం వెలుగుల్లో స్నేహితులతో కలిసి కాగితపు పుట్టగొడుగుల టోపీలు ధరించి, టీమ్ ఆక్టివిటీల్లో పాల్గొనడం, పిల్లల్లా ఆటలాడుతూ ఫోటోలకు పోజులు ఇవ్వడం, బాల్యాన్ని గుర్తు చేసే చిన్న చిన్న ఫన్ గేమ్స్ మొత్తం వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చాయి.
పురుషులు–మహిళలు వేర్వేరు టీంలుగా ఏర్పడి, నవ్వులు పూయించే క్రియేటివ్ హ్యూమన్ పిరమిడ్స్, హ్యాండ్–చైన్ యాక్టివిటీస్, టీం ఎంజాయ్మెంట్ గేమ్స్ నిర్వహించుకున్నారు. స్నేహం, ఏకత్వం, నిరాడంబరమైన ఆనందం ప్రతి ఫోటోలో కనిపించింది.
సామాజిక ఒత్తిడులు, దినచర్యలోని బాధ్యతల నుండి ఒకరోజు విరామం తీసుకుని ‘మనం కూడా పిల్లలమే కదా… కాస్తా మళ్లీ ఆ హాస్యాలలోకి వెళ్లుదాం’ అనే భావంతో ఈ కార్యక్రమం జరిగింది.అందరికీ మానసికంగా తాజాదనాన్ని అందించింది.
పాల్గొన్న పెద్దలు ఈ సందర్భంగా మాట్లాడుతూ “వయసు పెరుగుతుంది కానీ మనసు మాత్రం పిల్లగానే ఉండాలన్నారు. ఇలాంటి వేడుకలు జీవితానికి చిరునవ్వులు తిరిగి తీసుకొస్తాయి” అని తెలిపారు.
ఈ కార్యక్రమం అందరి పాల్గొనికతో విజయవంతంగా ముగిసింది. బాలల దినోత్సవం సందర్భంగా పెద్దలు పిల్లలుగా మారిన ఈ ప్రత్యేక వేడుక, అందరి హృదయాలలో ఆహ్లాదకరమైన గుర్తుగా నిలిచిపోయింది.
