365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే11,2025 : ఆమెకు ప్రపంచం అంతా చీకటి మయంగా ఉన్నా, గుండె నిండా ప్రేమ నింపుకుని తన అమ్మతనాన్ని 94 మంది అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఈ మాతృమూర్తి.
39 ఏళ్ల అంధురాలు, గాజియాబాద్లో అభాగ్యులైన చిన్నారుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కంటి చూపు లేకపోయినా, మాతృత్వపు స్పర్శతో ఆ పిల్లలకు అమ్మ ప్రేమను పంచుతున్నారు.
ఒంటరిగా, దిక్కులేని స్థితిలో ఉన్న ఆ చిన్నారులకు ఓ అంధురాలు వారికి చుక్కాని గా మారి ఆశ్రయం కల్పిస్తున్నారు. కేవలం అన్నం పెట్టడమే కాదు, వారికి ప్రేమను, భద్రత కల్పిస్తూ వారందరినీ ఒక కుటుంబంలా చూసుకుంటున్నారు. వారి ఆలనాపాలన చూస్తూ, వారికి చదువు చెప్పిస్తూ, వారి భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.
ఇది కూడా చదవండి…పలు రైళ్లు రద్దు.. ప్రయాణికులకు అసౌకర్యం..
This is also read..Essential Precautions to Take Before Laser Hair Removal
ఆ మాతృమూర్తి చెబుతున్న మాటలు అందరి మనసును కదిలిస్తాయి. “నాకు కళ్లు లేకపోతేనేం, నా పిల్లల కళ్లల్లో భవిష్యత్తును చూడగలను. వారి నవ్వే నాకు వేల కోట్ల కాంతులతో సమానం.” అని అంటున్నారు. ఆమె మాటల్లోని ఆత్మీయత, పిల్లల పట్ల ఆమెకున్న ప్రేమ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది.

ఈ మాతృదినోత్సవం సందర్భంగా ఆమె కథ ఎంతోమంది జీవితాలలో స్ఫూర్తిని నింపుతుంది. కళ్లు లేని అమ్మ ప్రేమను, అనాథలైన పిల్లల ఆశను తెలియజేస్తుంది. ప్రేమకు, త్యాగానికి ఈమె ఒక గొప్ప ఉదాహరణ. ఆమె చేస్తున్న ఈ గొప్ప కార్యానికి సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఆ మాతృ మూర్తికి శిరస్సు వంచి అందరం వందనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.