365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్ ,జనవరి 7,2025: టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ ‘సిఈఎస్ 2026’ వేదికగా తన అత్యంత శక్తివంతమైన, ఏఐ (AI) ఆధారిత ల్యాప్టాప్లు ‘గెలాక్సీ బుక్ 6’ సిరీస్ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో భాగంగా గెలాక్సీ బుక్ 6 అల్ట్రా, ప్రో,స్టాండర్డ్ మోడళ్లను ఆవిష్కరించింది.
ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్: ప్రపంచంలోనే మొదటిసారిగా ఇంటెల్ 18A టెక్నాలజీతో రూపొందిన అత్యాధునిక చిప్సెట్ను ఇందులో వాడారు. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా మెరుపు వేగంతో కూడిన పనితీరును అందిస్తుంది.

నెక్స్ట్ లెవల్ గ్రాఫిక్స్: అల్ట్రా మోడల్లో ఎన్విడియా జీఫోర్స్ (NVIDIA® GeForce RTX™ 5070/5060) గ్రాఫిక్స్ కార్డ్ ఉండటంతో, గేమింగ్,హై-ఎండ్ వీడియో ఎడిటింగ్ చేసేవారికి ఇది ఒక వరంలా మారనుంది.
గెలాక్సీ ఏఐ (Galaxy AI): కేవలం హార్డ్వేర్ మాత్రమే కాకుండా, ఏఐ ఉత్పాదకతను పెంచేలా ఆన్-డివైస్,క్లౌడ్ ఆధారిత ఇంటెలిజెంట్ ఫీచర్లను శాంసంగ్ ఇందులో పొందుపరిచింది.
ప్రో సిరీస్లో తొలిసారి ‘వేపర్ ఛాంబర్’
సాధారణంగా ల్యాప్టాప్లు వేడెక్కకుండా ఉండేందుకు వాడే ‘వేపర్ ఛాంబర్’ కూలింగ్ వ్యవస్థను ఈసారి ‘ప్రో’ మోడల్లో కూడా ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎక్కువ సమయం పని చేసినా ల్యాప్టాప్ వేడెక్కకుండా, శబ్దం రాకుండా నిశ్శబ్దంగా పని చేస్తుంది.
ఇదీ చదవండి :“సంక్రాంతి సంబరాల్లో ‘ట్రెండ్స్’ సందడి: పండుగ షాపింగ్పై అదిరిపోయే బహుమతులు!”
Read this also:Trends Announces ‘Sankranti Special’ Campaign: Festive Shopping Gets More Rewarding
ఇదీ చదవండి :ఆరోగ్యం విషయంలో విటమిన్లు, ఖనిజాల పాత్ర ఏమిటి..?
వినియోగదారుల డేటా రక్షణ కోసం శాంసంగ్ తన సొంత ‘నాక్స్’ (Knox) సెక్యూరిటీని అందించింది. ఇది హార్డ్వేర్ స్థాయిలోనే సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనితో పాటు విండోస్ 11 సెక్యూర్డ్-కోర్ ఫీచర్లు అదనపు రక్షణను ఇస్తాయి.
సన్నని డిజైన్, తేలికపాటి బరువుతో ఆకట్టుకుంటున్న ఈ గెలాక్సీ బుక్ 6 సిరీస్, గ్రే,సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.

సాధారణ వినియోగదారులకు: జనవరి 2026 చివరి వారం నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో లభ్యం.
బిజినెస్ వర్గాలకు: ‘ఎంటర్ప్రైజ్ ఎడిషన్’ పేరుతో ఏప్రిల్ 2026 నుంచి అందుబాటులోకి రానుంది.
“వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సాటిలేని వేగం, ఏఐ శక్తిని మేళవించి ఈ గెలాక్సీ బుక్ 6ను రూపొందించాం” అని శాంసంగ్ ఎంఎక్స్ ప్రెసిడెంట్ వోన్-జూన్ చోయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
