365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 28,2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బిడెన్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే తేదీని పక్కాగా అంచనా వేసిన ప్రముఖ మహిళా జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ కొత్త జోస్యంతో తెరపైకి వచ్చారు.

ఈసారి అమెరికా అధ్యక్షడి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అంచనా వేశారు. డొనాల్డ్ ట్రంప్-కమలా హారిస్ పోరులో డొనాల్డ్ ట్రంప్ గెలిచి అమెరికా అధ్యక్షుడవుతారని అమీ జోస్యం చెప్పారు. సన్ డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు. కానీ యురేనస్ స్థానం కొంతవరకు అనూహ్య పరిస్థితిని సూచిస్తుందని అమీ చెప్పారు.

నలభై ఏళ్ల అమీ ఇంటర్నెట్‌లో అత్యంత ప్రసిద్ధ జ్యోతిష్కురాలిగా పేరు గాంచింది. బిడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంపై జూలై 11న అమీ ట్వీట్ చేసింది. బిడెన్ నిర్ణయాన్ని ప్రకటించే తేదీకి సంబంధించిన ప్రత్యేకతలను ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. ఖచ్చితమైన తేదీ గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు, ఆమె జూలై 21 అని బదులిచ్చారు. జూలై 21న బిడెన్ అభ్యర్థిత్వం నుంచి వైదొలుగు తున్నట్లు ప్రకటించారు.

ఇదికూడా చదవండి:పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజయం

ఇదికూడా చదవండి: పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో కవితా పోటీలు..

ఇదికూడా చదవండి: ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత డా.సునీతా కృష్ణన్ ఒక సర్వైవరే కాదు ఒక సేవియర్

Also read: Telangana Minister Seethakka hails Padma Sri Awardee Dr. Sunitha Krishnan as ‘”A Savior, Not Just a Survivor”: Releases ‘I Am What I Am’