365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ జూన్ 12,2025: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పెను విషాదంలో ఎందరో ప్రాణాలు కోల్పోగా, ఓ మృత్యుంజయుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనే రమేష్ విశ్వాస్ కుమార్.

విమానంలోని 11A సీటులో ఉన్న ఈయన ప్రమాదం జరిగిన తర్వాత అద్భుతంగా సజీవంగా బయటపడటం అందరినీ నివ్వెరపరిచింది.

Read This also…Colgate Total Advanced: A Thoughtful Gift for Father’s Day Well-Being

ఇది కూడా చదవండి…వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ క్షేత్ర పరిశీలన..

ప్రమాద తీవ్రతను చూసిన వారెవరూ ప్రాణాలతో బయటపడతారని ఊహించలేదు. కానీ రమేష్ విశ్వాస్ కుమార్ విమాన శిథిలాల నుంచి స్వయంగా అంబులెన్స్ వద్దకు నడుచుకుంటూ వెళ్లగలిగారు. ఈ అద్భుతాన్ని అహ్మదాబాద్ పోలీసులు కూడా ధృవీకరించారు.

ప్రమాదం జరిగిన తీరును రమేష్ వివరిస్తూ.. “భారీ పేలుడు సంభవించింది, ఆ తర్వాత నలువైపులా మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాన్ని తలచుకుంటేనే భయం వేస్తుంది. నేను బ్రతికి ఉన్నానని నమ్మలేకపోతున్నాను, ఇది నిజంగా దేవుడి అద్భుతం” అని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇది కూడా చదవండి…ప్రపంచ చరిత్రలో మహో విషాదకర ఘటనలు: మానవాళిని కుదిపేసిన విపత్తులు

Read This also…world’s biggest Tragedies..

ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. లండన్‌కు బయలుదేరిన ఈ ఎయిర్ ఇండియా విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడితో సహా మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం ఓ నివాస ప్రాంతంలో కూలిపోయింది.