365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,4 ఫిబ్రవరి 2022 :విమాన ప్రయాణీకులకు సులభమైన,సౌకర్యవంతమైన సేవలను విస్తరించాలనే తమ నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఎయిర్‌ ఏసియా ఇండియా ఇప్పుడు తమ అతిథులు తమ వెబ్‌సైట్‌ airasia.co.in,మొబైల్‌ యాప్‌పై నామమాత్రపు రుసుము 800 రూపాయల ప్రారంభ ధరతో లాంజ్‌ సదుపాయాలను బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఫ్లైట్‌ బుకింగ్‌ సమయంలో లేదా బుకింగ్‌ అనంతర కాలంలో ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ సేవలను ఎయిర్‌లైన్‌ వెబ్‌సైట్‌ airasia.co.in పై మేనేజ్‌ విభాగంలో లాగిన్‌ కావడం లేదా చెక్‌ ఇన్‌ సమయంలో బుక్‌ చేసుకోవచ్చు.
ఈ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ సేవలతో అతిథులు పలు వసతులు అయినటువంటి హైస్పీడ్‌ వై–ఫై, వేడి ఆహారపదార్థాలు, శీతలపానీయాలు, స్నాక్స్‌, న్యూస్‌ పేపర్స్‌, మ్యాగజైన్స్‌, ల్యాప్‌టాప్స్‌ కోసం చార్జింగ్‌ స్టేషన్లు,మొబైల్స్‌ చార్జింగ్‌ స్టేషన్లు, వాష్‌ ,ఛేంజ్‌ సదుపాయాలు, బిజినెస్‌ సెంటర్‌సదుపాయాలు,లాంజ్‌ బార్స్‌ వంటివి ఉపయోగించవచ్చు.

ఈ లాంజ్‌ సేవలను ప్రస్తుతం ఎయిర్‌ ఏసియా ఇండియా 13 విమానాశ్రయాలలో అందిస్తుంది.వీటిలో ఎయిర్‌లైన్‌కు చెందిన నాలుగు హబ్‌లతో పాటుగా అతి ప్రధానమైన కేంద్రాలైనటువంటి బెంగళూరు (బీఎల్‌ఆర్‌), భుబనేశ్వర్‌ (బీబీఐ), చెన్నై (ఎంఏఏ), కొచి (సీఓకె), ఢిల్లీ (డీఈఎల్‌), గోవా (జీఓఐ), గౌహతీ(జీఏయు), హైదరాబాద్‌ (హెచ్‌వైడీ), జైపూర్‌ (జెఏఐ), కోల్‌కతా (సీసీయు), ముంబై(బీఓఎం), పూనె (పీఎన్‌క్యు), రాంా(ఐఎక్స్‌ఆర్‌) ఉన్నాయి.ఈ సేవలను గురించి ఎయిర్‌ ఆసియా ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సిద్ధార్ధ బుటాలియా మాట్లాడుతూ ‘‘ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లకు అతి సులభంగా చేరుకోవడంతో పాటుగా ఈ సదుపాయాలను మా అతిథులకు అందించడం వల్ల సమగ్రమైన,ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతు లను అందించగలమనే భరోసా అందిస్తున్నాము.

వినూత్నమైన,డిజిటల్‌ ఫస్ట్‌ బ్రాండ్‌గా మేము వైవిధ్యమైన ఆఫరింగ్స్‌తో మా సేవా అనుభవాలను సైతం వైవిధ్యీకరించే అవకాశం అందిస్తున్నాము. ఇటీవలనే మా నూతన డైనింగ్‌ బ్రాండ్‌ గౌర్మైర్‌ను ఆవిష్కరించాము.దీనిద్వారా తాజా,వేడి, ఆరోగ్యవంతమైన భోజనాలను 36వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో అందిస్తున్నాము. విమానం లోపల సేవలతో పాటుగా ఎయిర్‌ పోర్ట్‌లాంజ్‌ సేవలతో పాటుగా మరెన్నో వినూత్నమైన సేవలు అయినటువంటి ఫ్లైపోర్టర్‌ హోమ్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ బ్యాగేజీ డెలివరీ సేవలు వరకూ,అవిస్‌ భాగస్వామ్యంతో సెల్ఫ్‌ డ్రైవ్‌,చౌఫర్డ్‌ కార్‌ రెంటల్‌ సేవలను సైతం అందిస్తున్నాం’’ అని అన్నారు.