365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, నవంబర్ 11, 2025 :ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. చరిత్రలో తొలిసారిగా బ్యాంక్ త్రైమాసిక ఆదాయం ₹800 కోట్ల మైలురాయిని అధిగమించింది. మొత్తం ఆదాయం ₹804 కోట్లకు చేరుకుని, గత ఏడాదితో పోలిస్తే 19.4% వృద్ధి సాధించింది.

EBITDA ₹89.3 కోట్లుగా నమోదై 17.4% పెరుగుదల కనబర్చగా, నికర లాభం ₹11.8 కోట్లకు చేరింది. వార్షిక గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (GMV) ₹4,560 బిలియన్లకు ఎగసి, ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ సేవలకు ఆదరణ పెరిగింది. వినియోగదారుల సంఖ్యలో భారత్‌లో మూడో స్థానంలో నిలిచిన ఈ బ్యాంక్, కస్టమర్ బ్యాలెన్స్‌లను ₹3,987 కోట్లకు (35% YoY పెరుగుదల) చేర్చింది.

MD & CEO అనుబ్రతా బిస్వాస్: “మా డిజిటల్-ఫస్ట్ మోడల్ బలానికి, కస్టమర్ల విశ్వాసానికి ఇది నిదర్శనం. సేఫ్ సెకండ్ అకౌంట్ రోజువారీ డిజిటల్ లావాదేవీలకు శక్తినిస్తోంది.”
బ్యాంక్ తొలి 360-డిగ్రీ బ్రాండ్ క్యాంపెయిన్‌తో డిజిటల్ ఖాతాల ప్రారంభంలో బలమైన ట్రాక్షన్ సాధించింది.

రూపే ఆన్-ది-గో NCMC కార్డులతో 40 లక్షల మంది వినియోగదారులు మెట్రోల్లో ప్రయాణిస్తున్నారు. ఈ విభాగంలో 65% లావాదేవీలను ప్రాసెస్ చేస్తూ భారత్‌లోనే అతిపెద్ద NCMC అక్వైరర్‌గా నిలిచింది.

ఆఫ్‌లైన్ విస్తరణ:

5 లక్షల యాక్టివ్ బ్యాంకింగ్ పాయింట్లు
ప్రతి 5లో ఒకటి మహిళల నిర్వహణలో
3/4 గ్రామాలకు సేవలు
సగం రెమిటెన్స్‌లు, 1/4 ఆధార్ చెల్లింపులు
10-17 ఏళ్ల మైనర్లకు పొదుపు ఖాతాలు

సంవత్సరానికి 12 బిలియన్ లావాదేవీలు ప్రాసెస్ చేస్తూ, నెలకు ₹8,800 కోట్ల నగదును డిజిటలైజ్ చేస్తోంది. 9,200 కార్పొరేట్ భాగస్వాములతో ఓమ్నిఛానల్ B2B చెల్లింపుల్లో వేగం పుంజుకుంది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సురక్షిత, కలుపుగోలు డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్మిస్తూ ప్రతి భారతీయుడికి ఆర్థిక సేవలు అందేలా కృషి చేస్తోంది.