ఘనంగా శ్రీ గురు రాజా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ 11వ వార్షికోత్సవం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్నం, జూన్ 15,2025 : సంగీత విద్వాన్ ఆకెళ్ల మల్లిఖార్జునశర్మ 87వ గారి జయంతిని పురస్కరించుకొని, శ్రీ గురు రాజా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ తన 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఆదివారం నాడు జరిగిన ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

శ్రీ గురు రాజా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు విజినగిరి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఆటలు, గీతాలు, కీర్తనలు ఆలపించి తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ ఆకెళ్ల నరసింహస్వామి గారు, ఆయన మనవడు శ్రీ నిరంజన్‌ గారును ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం, ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు శ్రీ సంతోష్ కుమార్ గారు, శ్రీ మధుసూదనా రావు తదితరులు పాల్గొన్నారు. సంగీత కళను ప్రోత్సహించడంలో శ్రీ గురు రాజా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.